ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నపుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆధిపత్యం చేస్తున్న ఆంధ్రా వారి మీద ఉద్యమకారులు విమర్శలు చేయడం.. తెలుగు సినిమాను వాళ్లు చెరబట్టారని ఆరోపణలు చేయడం.. కొన్నిసార్లు సినిమా షూటింగ్ బృందాల మీద దాడులకు కూడా పాల్పడడం గుర్తుండే ఉంటుంది.
వారి ఆవేశంలో, ఆవేదనలో అర్థం ఉందని కొందరు అనేవాళ్లు. కొందరు దీన్ని తప్పుబట్టేవాళ్లు. ఐతే రాష్ట్రం రెండుగా విడిపోయి దశాబ్దం దాటిపోయింది. తెలంగాణ మీద వివక్ష అనే చర్చే పక్కకు వెళ్లిపోయింది.
సినిమా వాళ్లంతా ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి వాళ్లు తెలంగాణ ప్రాంతవాసులుగానే గుర్తింపు పొందుతున్నారు. ఇక్కడి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలతో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగిపోతున్నారు.
ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సర్వపరిచే బాధ్యతను రేవంత్ రెడ్డి సర్కారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం మీద వివాదం మొదలవడం గమనార్హం. ఈ విషయాన్ని ఖండిస్తూ తెలంగాణ సంగీతకారుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసింది. తెలంగాణ గీతాన్ని ఆంధ్రా మూలాలున్న కీరవాణికి అప్పగించడాన్ని వాళ్లు తప్పుబట్టారు.
మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రం మనదని, ఆంధ్రాకు చెందిన కీరవాణికి ఈ ఛాన్స్ ఇవ్వొద్దని ఈ లేఖలో పేర్కొన్నారు. కానీ వేరే సంగీత దర్శకుడైతే ఏమో కానీ.. బాలీవుడ్లోనూ ఎన్నో సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన, ఆస్కార్ అవార్డు కూడా గెలిచి ప్రపంచ స్థాయికి ఎదిగిన కీరవాణి మీద ఒక ప్రాంత ముద్ర వేసి విమర్శలు చేయడం ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా బాధ కలిగించేదే. చరిత్రలో ఎందరో గొప్పవాళ్లున్నారు. వాళ్లందరినీ కూడా ఇలా ప్రాంతాల వారీగా విడదీసి చూస్తే తెలుగువారి ఉమ్మడి వారసత్వ సంపద సంగతేంటో?
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…