ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నపుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆధిపత్యం చేస్తున్న ఆంధ్రా వారి మీద ఉద్యమకారులు విమర్శలు చేయడం.. తెలుగు సినిమాను వాళ్లు చెరబట్టారని ఆరోపణలు చేయడం.. కొన్నిసార్లు సినిమా షూటింగ్ బృందాల మీద దాడులకు కూడా పాల్పడడం గుర్తుండే ఉంటుంది.
వారి ఆవేశంలో, ఆవేదనలో అర్థం ఉందని కొందరు అనేవాళ్లు. కొందరు దీన్ని తప్పుబట్టేవాళ్లు. ఐతే రాష్ట్రం రెండుగా విడిపోయి దశాబ్దం దాటిపోయింది. తెలంగాణ మీద వివక్ష అనే చర్చే పక్కకు వెళ్లిపోయింది.
సినిమా వాళ్లంతా ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి వాళ్లు తెలంగాణ ప్రాంతవాసులుగానే గుర్తింపు పొందుతున్నారు. ఇక్కడి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలతో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగిపోతున్నారు.
ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సర్వపరిచే బాధ్యతను రేవంత్ రెడ్డి సర్కారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం మీద వివాదం మొదలవడం గమనార్హం. ఈ విషయాన్ని ఖండిస్తూ తెలంగాణ సంగీతకారుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసింది. తెలంగాణ గీతాన్ని ఆంధ్రా మూలాలున్న కీరవాణికి అప్పగించడాన్ని వాళ్లు తప్పుబట్టారు.
మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రం మనదని, ఆంధ్రాకు చెందిన కీరవాణికి ఈ ఛాన్స్ ఇవ్వొద్దని ఈ లేఖలో పేర్కొన్నారు. కానీ వేరే సంగీత దర్శకుడైతే ఏమో కానీ.. బాలీవుడ్లోనూ ఎన్నో సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన, ఆస్కార్ అవార్డు కూడా గెలిచి ప్రపంచ స్థాయికి ఎదిగిన కీరవాణి మీద ఒక ప్రాంత ముద్ర వేసి విమర్శలు చేయడం ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎవ్వరికైనా బాధ కలిగించేదే. చరిత్రలో ఎందరో గొప్పవాళ్లున్నారు. వాళ్లందరినీ కూడా ఇలా ప్రాంతాల వారీగా విడదీసి చూస్తే తెలుగువారి ఉమ్మడి వారసత్వ సంపద సంగతేంటో?
This post was last modified on May 28, 2024 7:11 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…