ఈ రోజుల్లో టాలీవుడ్లోకి అడుగు పెట్టే పర భాషా హీరోయిన్లు చాలా ఈజీగా తెలుగు నేర్చేసుకుంటున్నారు. అచ్చమైన తెలుగమ్మాయిల్లా మన భాష మాట్లాడేస్తున్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం చాలా ఏళ్ల నుంచి టాలీవుడ్లో ఉన్నా తెలుగు సరిగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. వేదికల మీద అందరికీ నమస్కారం అని ఒకట్రెండు మాలు తెలుగులో మాట్లాడి.. ఆ తర్వాత ఇంగ్లిష్లోకి వెళ్లిపోతుంటారు. ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు.
తన తోటి స్టార్ హీరోయిన్లు చాలామంది తెలుగులో గలగలా మాట్లాడేస్తుంటే.. కాజల్ మాత్రం ఇంగ్లిష్కే పరిమితం అవుతుంటుంది. ఇదే విషయమై ఓ అభిమాని అభ్యంతర పెడితే కాజల్ ఆసక్తికర రీతిలో స్పందించింది. తన కొత్త చిత్రం ‘సత్యభామ’ను ప్రమోట్ చేసే క్రమంలో నెటిజన్లతో చిట్ చాట్ సందర్భంగా తన ‘తెలుగు’ గురించి కాజల్ మాట్లాడింది.
హర్ష అనే అభిమాని సోషల్ మీడియాలో తన గురించి పెట్టిన పోస్ట్ను కాజల్ చదివి వినిపించింది. “ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతోంది. మీకు తెలుగులో ‘అందరికీ నమస్కారం’ తప్ప ఏం రాలేదేంటి? ప్లీజ్ నాకోసం తెలుగులో ఆ నమస్కారం కాకుండా వేరేది ఏదైనా మాట్లాడండి” అని ఆ అభిమాని అందులో పేర్కొన్నాడు.
దీనికి కాజల్ బదులిస్తూ.. “ఏం మాట్లాడుతున్నావు హర్ష. నాకు తెలుగు రాకపోవడం ఏంటి? ఇదేనా నా గురించి నీకు తెలిసింది? నా తెలుగు అంతా మనసులో ఉంటుంది. కానీ తెలుగులో మాట్లాడాలంటే డౌట్ వస్తుంది. ఇది రైటా రాంగా అని. కానీ నాకు తెలుగు బాగా తెలుసు. ఇప్పుడు మాట్లాడుతుంటే ఫీల్ బాగా ఉంది. కెమెరా ముందు మాట్లాడకపోతే నాకు తెలుగు రానట్లేనా? సరే కావాలంటే చూడు. ఈసారి సత్యభామ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతా” అని కాజల్ స్పష్టం చేసింది.
This post was last modified on May 23, 2024 2:50 pm
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…