ఈ ఏడాది ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కల్కి’ ఒకటి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. పైగా ‘కల్కి’ హాలీవుడ్ స్టయిల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో ఇది తెరకెక్కడం.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉండడంతో ఇది ఒక ఎపిక్ మూవీ అవుతుందనే అంచనాలున్నాయి.
ఐతే ఈ సినిమా స్థాయికి తగ్గట్లుగా దీన్ని ప్రమోట్ చేయట్లేదనే అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ‘కల్కి’ ఫస్ట్ లుక్ అప్పట్లో ఎంత ట్రోలింగ్కు గురైందో తెలిసిందే. తర్వాత వచ్చిన టీజర్ ఓకే అనిపించడంతో సినిమా మీద ఆశలు పెంచుకున్నారు.
లేటెస్ట్గా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలా డిజైన్ చేసిన బుజ్జి అనే అల్ట్రా మోడర్న్ కారును ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం ఒక ప్రమోషనల్ ఈవెంట్ కూడా చేశారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఈవెంట్కు సెలక్టివ్గా అభిమానులను, అలాగే వివిధ ప్రాంతాల నుంచి మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. కానీ ఈ ఈవెంట్ అనుకున్న స్థాయిలో సినిమాకు హైప్ తీసుకురాలేకపోయింది. అసలీ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో సరిగా హైప్ రాలేదు. ఇంత భారీ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ జరిగితే సోషల్ మీడియా హోరెత్తిపోవాలి. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. టీజర్ కూడా జస్ట్ యావరేజ్ అన్నట్లు ఉండడం కూడా ప్రతికూలమైంది.
ఈ సినిమా రేంజ్ ఏంటి.. జరుగుతున్న ప్రమోషనేంటి.. వదులుతున్న కంటెంట్ ఏంటి అని ప్రభాస్ అభిమానులే కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి భారీ చిత్రాలను రాజమౌళి ప్రమోట్ చేసే తీరు.. ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. నాగ్ అశ్విన్ అండ్ టీం రాజమౌళిలా ప్రమోషన్లను డిజైన్ చేసి, కంటెంట్ మరింత ఎగ్జైటింగ్గా ఉండేలా చూసుకుంటేనే ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 23, 2024 2:44 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…