బాగా గ్యాప్ తర్వాత కాజల్ అగర్వాల్ సోలోగా టైటిల్ రోల్ చేసిన సినిమా సత్యభామ. ఈ నెల 31 విడుదల కావాల్సి ఉన్నా కొత్తగా వదులుతున్న పోస్టర్లలో డేట్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గంగం గణేశాలతో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో జూన్ 7 వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు కనక సత్యభామ ప్రమోషన్ భారం మొత్తం కాజల్ మీదే పడింది. కమర్షియల్ మూవీ కాకపోవడంతో ఆడియన్స్ లోకి బలంగా తీసుకెళ్లడానికి టీమ్ బాగా కష్టపడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిసిటీలో స్టార్లు భాగమైతే మంచిదే. అందుకే ఎల్లుండి 24 జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బాలకృష్ణని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కాజల్ ఇటీవలే భగవంత్ కేసరి చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడది ఈ రూపంలో ఉపయోగపడుతోంది. తర్వాతి వారం చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని టాక్. ఖైదీ నెంబర్ 150 ద్వారా చిరుతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న కాజల్ కు ఆచార్య విషయంలో కలిగిన అసంతృప్తిని సత్యభామ వేడుకకు హాజరు కావడం ద్వారా చిరు కొంతైనా తీర్చవచ్చు.
మొత్తానికి చిరంజీవి, బాలకృష్ణల మద్దతు సత్యభామకు ఉపయోగపడేలా ఉంది. క్రైమ్ జానర్ లో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీకి గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాక సమర్పకుడిగా వ్యవహరించాడు. సో కంటెంట్ మీద నమ్మకం పెట్టుకోవచ్చన్న భరోసా అయితే దక్కింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. క్వీన్ అఫ్ మాసెస్ గా కొత్త ట్యాగ్ తో ప్రమోట్ అవుతున్న కాజల్ అగర్వాల్ కు ఆపై జూలైలో విడుదల కాబోతున్న భారతీయుడు 2 మరో కీలక మలుపు కానుంది. రెండు హిట్టయితే ఇక చెప్పేదేముంది.
This post was last modified on May 22, 2024 5:38 pm
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…
రాజకీయాల్లోకి అఖిల భారత ఉద్యోగులు రావడం సహజం అయిపోయింది. ఉద్యోగాలు విరమణ చేసిన వారు కొందరు.. మధ్యలోనే పీక్ స్టేజ్లో…