తెలుగులో సీతారామంతో టాలీవుడ్ డెబ్యూనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న మంచి విజయాన్ని నమోదు చేసింది. వరస ఆఫర్లు వస్తున్నా సరే ఆచితూచి అడుగులు వేసిన మృణాల్ కు విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ఫలితం హ్యాట్రిక్ సక్సెస్ దక్కకుండా అడ్డు పడింది. ఇది మాములు ఫ్లాప్ కాదు. దీని సంగతలా ఉంచితే ఈ అమ్మడి దృష్టి ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉన్నట్టు స్పష్టమవుతోంది. గతంలో విశ్వంభర ఆఫర్ వచ్చినా ఎక్కువ డేట్లు అవసరమైతే హిందీ అవకాశాలకు ఇబ్బందవుతుందని నో చెప్పినట్టు ఆల్రెడీ టాక్ ఉంది.
దానికి తగ్గట్టే మృణాల్ తాజాగా సంజయ్ లీలా భన్సాలీ సంగీతం ప్లస్ నిర్మాణంలో రూపొందే ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు పచ్చజెండా ఊపింది. సిద్దాంత్ చతుర్వేది హీరోగా శ్రీదేవి చివరి సినిమా మామ్ తో ఆడియన్స్ ని మెప్పించిన రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమకథే అయినప్పటికీ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ పాయింట్ తో ఉంటుందట. ఈ ప్రాజెక్టు ఒప్పుకోవాలనే ఉద్దేశంతోనే సౌత్ నుంచి వెళ్లిన రెండు ఛాన్సులకు మృణాల్ నో చెప్పిందని వినికిడి. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కే ప్యాన్ ఇండియా మూవీకి తన పేరు పరిశీలనలో ఉందని యూనిట్ లీక్.
ఇంకా అధికారికంగా చెప్పలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ మొత్తానికి మృణాల్ ఫోకస్ మాత్రం ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉందన్నది స్పష్టం. సీతారామం తర్వాత తనవి మూడు హిందీ సినిమాలు రిలీజైతే ఏదీ సక్సెస్ కాలేదు. రామ్ రెడ్ రీమేక్ గుంరాహ్ సైతం సోసో ఫలితాన్నే అందుకుంది. మూడు పదుల వయసులో వేగం పెంచిన మృణాల్ ఠాకూర్ ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అదేదో తెలుగులోనే ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇక్కడే సెటిలయ్యేదని అభిమానులు ఫీలవుతున్నారు కానీ తన మనసులో ఏముందో చేతల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోందిగా.
This post was last modified on May 22, 2024 12:31 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…