వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. గీత గోవిందం కాంబో మేజిక్ రిపీట్ చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పరశురామ్ పూర్తిగా నీరు గార్చేశాడు. అయినా సరే రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్. ఇక్కడితో అయిపోలేదు. ఫ్యాన్స్ మబ్బుల్లో తేలిపోయే వార్త మరొకటి ఉంది.
సుమారు మూడేళ్ళ క్రితమే విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ కలయికలో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ కార్యరూపం దాల్చలేదు. పుష్ప 2 తర్వాత ఉంటుందేమో అనుకుంటే ఈలోగా రామ్ చరణ్ 16 అనౌన్స్ మెంట్ వచ్చింది. ఎంతలేదన్నా ఇది రిలీజయ్యేలోపు 2026 దాటిపోవచ్చు. ఇవాళ జరిగిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ కొంత ఆలస్యమైనా విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని, క్యాన్సిల్ కాలేదనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది.
అనడమైతే అన్నారు కానీ ఇది అంత సులభంగా జరిగేది కాదు. ఎందుకంటే పుష్ప కోసం అయిదేళ్ళు ఖర్చు పెట్టిన సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కోసం ఎంతలేదన్నా రెండు మూడు సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికి విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. సరే పోనీ ఎలా ఉన్నా మాట ఇచ్చాము కాబట్టి తీయాలనుకున్నా పెరిగిన సుకుమార్ ఇమేజ్ కి తగ్గట్టు అది మాములు స్కేల్ లో ఉండకూడదు. వందల కోట్ల బడ్జెట్ అయితేనే ఆయన స్థాయికి తగ్గట్టు ఉంటుంది. మరి లేట్ అయినా ఈ ఇద్దరు చేతులు కలుపుతారా లేక ఇది తాత్కాలిక ఆనందమేనా అనేది వేచి చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…