వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. గీత గోవిందం కాంబో మేజిక్ రిపీట్ చేస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు పరశురామ్ పూర్తిగా నీరు గార్చేశాడు. అయినా సరే రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా ఇవన్నీ ఒకదాన్ని మించి మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్. ఇక్కడితో అయిపోలేదు. ఫ్యాన్స్ మబ్బుల్లో తేలిపోయే వార్త మరొకటి ఉంది.
సుమారు మూడేళ్ళ క్రితమే విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ కలయికలో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ కార్యరూపం దాల్చలేదు. పుష్ప 2 తర్వాత ఉంటుందేమో అనుకుంటే ఈలోగా రామ్ చరణ్ 16 అనౌన్స్ మెంట్ వచ్చింది. ఎంతలేదన్నా ఇది రిలీజయ్యేలోపు 2026 దాటిపోవచ్చు. ఇవాళ జరిగిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ కొంత ఆలస్యమైనా విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని, క్యాన్సిల్ కాలేదనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది.
అనడమైతే అన్నారు కానీ ఇది అంత సులభంగా జరిగేది కాదు. ఎందుకంటే పుష్ప కోసం అయిదేళ్ళు ఖర్చు పెట్టిన సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కోసం ఎంతలేదన్నా రెండు మూడు సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికి విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. సరే పోనీ ఎలా ఉన్నా మాట ఇచ్చాము కాబట్టి తీయాలనుకున్నా పెరిగిన సుకుమార్ ఇమేజ్ కి తగ్గట్టు అది మాములు స్కేల్ లో ఉండకూడదు. వందల కోట్ల బడ్జెట్ అయితేనే ఆయన స్థాయికి తగ్గట్టు ఉంటుంది. మరి లేట్ అయినా ఈ ఇద్దరు చేతులు కలుపుతారా లేక ఇది తాత్కాలిక ఆనందమేనా అనేది వేచి చూడాలి.
This post was last modified on May 20, 2024 6:35 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…