దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే దాని గురించి రకరకాల ఊహాగానాలు జరిగాయి. ఫైనల్ గా వాటికి చెక్ పడింది. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం కన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ వైపే నీల్ మొగ్గు చూపుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో టైటిల్ చెప్పకపోయినా ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టంగా పేర్కొనడంతో ఇకపై దీని గురించి ఎక్కువ డౌట్ పెట్టుకోవడానికి లేదనే చెప్పాలి. అయితే ఇక్కడితో ట్విస్టులు అయిపోయాయని అనుకోవడానికి లేదు.
దేవర పార్ట్ 1 నుంచి జూనియర్ ఎన్టీఆర్ జూలై లోపే ఫ్రీ అవుతాడు కాబట్టి దానికి అనుగుణంగా ప్రశాంత్ నీల్ తన ప్యాన్ ఇండియా మూవీకి ఆగస్టని ఫిక్స్ అయ్యుండొచ్చు. అయితే వార్ 2 ఇంకో వైపు జరుగుతోంది కనక దాని చిత్రీకరణ డిసెంబర్ లోగా పూర్తి చేసి బల్క్ డేట్లు కెజిఎఫ్ దర్శకుడికే కేటాయించేలా తారక్ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. మరి దేవర 2 సంగతేంటంటే మొదటి భాగంతో పాటు సమాంతరంగా పూర్తి చేస్తున్నారనే మాట వినిపిస్తోంది కానీ కొరటాల శివ చెబితే తప్ప దీన్ని నమ్మలేం. ఒకవేళా అబద్దమైతే 2025 వేసవి టైంలో రెండో దేవరను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఎందుకు పక్కనపెట్టారనే పాయింట్ కు వస్తే ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా అది కెజిఎఫ్ రేంజ్ లో యునిమస్ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదనేది వాస్తవం. అందుకే అర్జెంట్ గా రెండో పార్ట్ చూసేయాలన్న ఆత్రం బాహుబలి స్థాయిలో ప్రేక్షకుల్లో లేదు. ఇంకొంత సీరియస్ హోమ్ వర్క్ చేసి ఏడాది ఆలస్యమైనా సరే బెస్ట్ అనిపించుకునే స్థాయిలో ప్లాన్ చేస్తారని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ప్రభాస్ ఎలాగూ రాజా డీలక్స్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలతో బిజీ అయిపోతాడు కాబట్టి ఈలోగా ప్రశాంత్ నీల్ ప్రశాంతంగా తారక్ మూవీని పూర్తి చేయొచ్చు.
This post was last modified on May 20, 2024 3:05 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…