చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుంది. కనీస నిర్వహణ ఖర్చులు కూడా వసూలు కానంత దీనంగా కలెక్షన్లు రావడంతో తెలంగాణలో పలు సింగల్ స్క్రీన్లు రెండు వారాల పాటు మూసేసిన సంగతి తెలిసిందే. ఇదేమి ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాకపోయినా స్వచ్చందంగా బందులో పాలు పంచుకున్నవాళ్ళే ఎక్కువ. నెలన్నరకు పైగా ఇదే పరిస్థితి ఉండటంతో ఇంతకు మించి యాజమాన్యాలకు వేరే గత్యంతరం లేకపోయింది.
నిన్న శుక్రవారం మినిమమ్ బజ్ ఉన్న ఒక్క సినిమా రిలీజ్ లేకపోవడంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రసాద్ మల్టీప్లెక్స్, ఆర్టిసి క్రాస్ రోడ్స్ లాంటివి బోసిపోయి కనిపించాయి. విచిత్రంగా పాత మూవీ అపరిచితుడుకి సుదర్శన్ 35 ఎంఎంలో నిన్న ఉదయం, సెకండ్ షోలు ఒక్క టికెట్ మిగలనంతగా హౌస్ ఫుల్ అయిపోవడం గమనించాల్సిన విషయం. అంటే జనాలు టికెట్లు కొని థియేటర్లకొచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను యావరేజ్ గా అయినా సరే సంతృప్తి పరిచే సరైన కంటెంట్ రాకపోవడమే ఈ దుస్థితికి దారి తీసింది. గ్యాంగ్ అఫ్ గోదావరి లాంటివి చివరి నిమిషంలో తప్పుకోవడం గాయం మీద కారమే.
ఇరవై అయిదున రిలీజ్ కాబోతున్న లవ్ మీ గురించి హీరో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ తెరిపిస్తామని ధీమాగా చెప్పాడు. నిర్మాత దిల్ రాజుతో సహా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది ఇదే. పబ్లిక్ తో మళ్ళీ హాళ్ళన్నీ కళకళలాడాలి. హనుమాన్, టిల్లుస్క్వేర్ , గుంటూరు కారంకు చూసిన హడావిడి కనిపించాలి. కలెక్షన్ల లెక్కలతో ట్రేడ్ బిజీ అయిపోవాలి. రికార్డుల వార్తలు మీడియాలో వస్తూ ఉండాలి. ఇవేవి లేకపోవడం వల్లే ఎన్నికలు, ఐపీఎల్ అంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. జూన్ 27 కల్కి వచ్చేలోపే బాక్సాఫీస్ వాతావరణం కుదుటపడితే జరిగేది అద్భుతాలే
This post was last modified on May 18, 2024 11:14 am
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…