చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుంది. కనీస నిర్వహణ ఖర్చులు కూడా వసూలు కానంత దీనంగా కలెక్షన్లు రావడంతో తెలంగాణలో పలు సింగల్ స్క్రీన్లు రెండు వారాల పాటు మూసేసిన సంగతి తెలిసిందే. ఇదేమి ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాకపోయినా స్వచ్చందంగా బందులో పాలు పంచుకున్నవాళ్ళే ఎక్కువ. నెలన్నరకు పైగా ఇదే పరిస్థితి ఉండటంతో ఇంతకు మించి యాజమాన్యాలకు వేరే గత్యంతరం లేకపోయింది.
నిన్న శుక్రవారం మినిమమ్ బజ్ ఉన్న ఒక్క సినిమా రిలీజ్ లేకపోవడంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రసాద్ మల్టీప్లెక్స్, ఆర్టిసి క్రాస్ రోడ్స్ లాంటివి బోసిపోయి కనిపించాయి. విచిత్రంగా పాత మూవీ అపరిచితుడుకి సుదర్శన్ 35 ఎంఎంలో నిన్న ఉదయం, సెకండ్ షోలు ఒక్క టికెట్ మిగలనంతగా హౌస్ ఫుల్ అయిపోవడం గమనించాల్సిన విషయం. అంటే జనాలు టికెట్లు కొని థియేటర్లకొచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను యావరేజ్ గా అయినా సరే సంతృప్తి పరిచే సరైన కంటెంట్ రాకపోవడమే ఈ దుస్థితికి దారి తీసింది. గ్యాంగ్ అఫ్ గోదావరి లాంటివి చివరి నిమిషంలో తప్పుకోవడం గాయం మీద కారమే.
ఇరవై అయిదున రిలీజ్ కాబోతున్న లవ్ మీ గురించి హీరో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ తెరిపిస్తామని ధీమాగా చెప్పాడు. నిర్మాత దిల్ రాజుతో సహా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది ఇదే. పబ్లిక్ తో మళ్ళీ హాళ్ళన్నీ కళకళలాడాలి. హనుమాన్, టిల్లుస్క్వేర్ , గుంటూరు కారంకు చూసిన హడావిడి కనిపించాలి. కలెక్షన్ల లెక్కలతో ట్రేడ్ బిజీ అయిపోవాలి. రికార్డుల వార్తలు మీడియాలో వస్తూ ఉండాలి. ఇవేవి లేకపోవడం వల్లే ఎన్నికలు, ఐపీఎల్ అంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. జూన్ 27 కల్కి వచ్చేలోపే బాక్సాఫీస్ వాతావరణం కుదుటపడితే జరిగేది అద్భుతాలే
This post was last modified on May 18, 2024 11:14 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…