చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుంది. కనీస నిర్వహణ ఖర్చులు కూడా వసూలు కానంత దీనంగా కలెక్షన్లు రావడంతో తెలంగాణలో పలు సింగల్ స్క్రీన్లు రెండు వారాల పాటు మూసేసిన సంగతి తెలిసిందే. ఇదేమి ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాకపోయినా స్వచ్చందంగా బందులో పాలు పంచుకున్నవాళ్ళే ఎక్కువ. నెలన్నరకు పైగా ఇదే పరిస్థితి ఉండటంతో ఇంతకు మించి యాజమాన్యాలకు వేరే గత్యంతరం లేకపోయింది.
నిన్న శుక్రవారం మినిమమ్ బజ్ ఉన్న ఒక్క సినిమా రిలీజ్ లేకపోవడంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రసాద్ మల్టీప్లెక్స్, ఆర్టిసి క్రాస్ రోడ్స్ లాంటివి బోసిపోయి కనిపించాయి. విచిత్రంగా పాత మూవీ అపరిచితుడుకి సుదర్శన్ 35 ఎంఎంలో నిన్న ఉదయం, సెకండ్ షోలు ఒక్క టికెట్ మిగలనంతగా హౌస్ ఫుల్ అయిపోవడం గమనించాల్సిన విషయం. అంటే జనాలు టికెట్లు కొని థియేటర్లకొచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను యావరేజ్ గా అయినా సరే సంతృప్తి పరిచే సరైన కంటెంట్ రాకపోవడమే ఈ దుస్థితికి దారి తీసింది. గ్యాంగ్ అఫ్ గోదావరి లాంటివి చివరి నిమిషంలో తప్పుకోవడం గాయం మీద కారమే.
ఇరవై అయిదున రిలీజ్ కాబోతున్న లవ్ మీ గురించి హీరో ఆశిష్ మాట్లాడుతూ మూసుకున్న థియేటర్లన్నీ తెరిపిస్తామని ధీమాగా చెప్పాడు. నిర్మాత దిల్ రాజుతో సహా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది ఇదే. పబ్లిక్ తో మళ్ళీ హాళ్ళన్నీ కళకళలాడాలి. హనుమాన్, టిల్లుస్క్వేర్ , గుంటూరు కారంకు చూసిన హడావిడి కనిపించాలి. కలెక్షన్ల లెక్కలతో ట్రేడ్ బిజీ అయిపోవాలి. రికార్డుల వార్తలు మీడియాలో వస్తూ ఉండాలి. ఇవేవి లేకపోవడం వల్లే ఎన్నికలు, ఐపీఎల్ అంటూ కాలక్షేపం చేయాల్సి వచ్చింది. జూన్ 27 కల్కి వచ్చేలోపే బాక్సాఫీస్ వాతావరణం కుదుటపడితే జరిగేది అద్భుతాలే
This post was last modified on May 18, 2024 11:14 am
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…