రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్ మూవీస్ కే కాదు సమరసింహారెడ్డి లాంటి మాస్ బ్లాక్ బస్టర్లకు సైతం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయినా సరే బయ్యర్లు మాత్రం ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆపేలా లేరు. ఎల్లుండి మే 17 విక్రమ్ అపరిచితుడు భారీ ఎత్తున పునః విడుదల కానుంది.
దీనికొక్కటి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి తప్పుకోవడంతో రాజు యాదవ్ మినహా చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ బరిలో లేకుండా పోయింది.
అసలే ఎన్నికల తర్వాత థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మంచి ఆప్షన్లు లేకపోవడం అపరిచితుడుకి కలిసి వచ్చేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్టయ్యింది.
ముఖ్యంగా విక్రమ్ విశ్వరూపానికి టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హరీష్ జైరాజ్ పాటలు ఊపేశాయి. తప్పు చేసి జనాల ప్రాణాలతో ఆదుకునే వాళ్లకు కుంభీపాకం, నలపాకం అంటూ విక్రమ్ వేసే శిక్షలు, సమాజానికి ఇచ్చే సందేశం అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యాయి. టీవీలోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది.
అలాంటి అపరిచితుడుని మళ్ళీ అనుభూతి చెందడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపించినా ఆశ్చర్యం లేదు. క్రమంగా జనం ఫోకస్ రాజకీయాల నుంచి సినిమాల వైపు వస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం నిర్మాతల చేతుల్లో ఉంది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా మే 17తో పాటు ఆపై వారం కూడా వృథాగా వదిలేశారు.
దీంతో మే 31 ఏకంగా అయిదు చిత్రాలు తలపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎవరు తప్పుకుంటారో ఇంకా స్పష్టత లేదు. సో ఎలా చూసుకున్నా ఈ ఫ్రైడే రాజు యాదవ్ మీద ఆసక్తి లేనివాళ్లకు అపరిచితుడు తప్ప ఇంకో ఎంటర్ టైన్మెంట్ కనిపించడం లేదు. ఏ మేరకు వాడుకుంటాడో చూడాలి.
This post was last modified on May 15, 2024 10:00 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…