రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్ మూవీస్ కే కాదు సమరసింహారెడ్డి లాంటి మాస్ బ్లాక్ బస్టర్లకు సైతం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయినా సరే బయ్యర్లు మాత్రం ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆపేలా లేరు. ఎల్లుండి మే 17 విక్రమ్ అపరిచితుడు భారీ ఎత్తున పునః విడుదల కానుంది.
దీనికొక్కటి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి తప్పుకోవడంతో రాజు యాదవ్ మినహా చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ బరిలో లేకుండా పోయింది.
అసలే ఎన్నికల తర్వాత థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మంచి ఆప్షన్లు లేకపోవడం అపరిచితుడుకి కలిసి వచ్చేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్టయ్యింది.
ముఖ్యంగా విక్రమ్ విశ్వరూపానికి టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హరీష్ జైరాజ్ పాటలు ఊపేశాయి. తప్పు చేసి జనాల ప్రాణాలతో ఆదుకునే వాళ్లకు కుంభీపాకం, నలపాకం అంటూ విక్రమ్ వేసే శిక్షలు, సమాజానికి ఇచ్చే సందేశం అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యాయి. టీవీలోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది.
అలాంటి అపరిచితుడుని మళ్ళీ అనుభూతి చెందడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపించినా ఆశ్చర్యం లేదు. క్రమంగా జనం ఫోకస్ రాజకీయాల నుంచి సినిమాల వైపు వస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం నిర్మాతల చేతుల్లో ఉంది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా మే 17తో పాటు ఆపై వారం కూడా వృథాగా వదిలేశారు.
దీంతో మే 31 ఏకంగా అయిదు చిత్రాలు తలపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎవరు తప్పుకుంటారో ఇంకా స్పష్టత లేదు. సో ఎలా చూసుకున్నా ఈ ఫ్రైడే రాజు యాదవ్ మీద ఆసక్తి లేనివాళ్లకు అపరిచితుడు తప్ప ఇంకో ఎంటర్ టైన్మెంట్ కనిపించడం లేదు. ఏ మేరకు వాడుకుంటాడో చూడాలి.
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…