రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్ మూవీస్ కే కాదు సమరసింహారెడ్డి లాంటి మాస్ బ్లాక్ బస్టర్లకు సైతం ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయినా సరే బయ్యర్లు మాత్రం ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆపేలా లేరు. ఎల్లుండి మే 17 విక్రమ్ అపరిచితుడు భారీ ఎత్తున పునః విడుదల కానుంది.
దీనికొక్కటి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి తప్పుకోవడంతో రాజు యాదవ్ మినహా చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ బరిలో లేకుండా పోయింది.
అసలే ఎన్నికల తర్వాత థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి మంచి ఆప్షన్లు లేకపోవడం అపరిచితుడుకి కలిసి వచ్చేలా ఉంది. శంకర్ దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్టయ్యింది.
ముఖ్యంగా విక్రమ్ విశ్వరూపానికి టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. హరీష్ జైరాజ్ పాటలు ఊపేశాయి. తప్పు చేసి జనాల ప్రాణాలతో ఆదుకునే వాళ్లకు కుంభీపాకం, నలపాకం అంటూ విక్రమ్ వేసే శిక్షలు, సమాజానికి ఇచ్చే సందేశం అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యాయి. టీవీలోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది.
అలాంటి అపరిచితుడుని మళ్ళీ అనుభూతి చెందడానికి ఎక్కువ శాతం ఆసక్తి చూపించినా ఆశ్చర్యం లేదు. క్రమంగా జనం ఫోకస్ రాజకీయాల నుంచి సినిమాల వైపు వస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడం నిర్మాతల చేతుల్లో ఉంది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా మే 17తో పాటు ఆపై వారం కూడా వృథాగా వదిలేశారు.
దీంతో మే 31 ఏకంగా అయిదు చిత్రాలు తలపడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎవరు తప్పుకుంటారో ఇంకా స్పష్టత లేదు. సో ఎలా చూసుకున్నా ఈ ఫ్రైడే రాజు యాదవ్ మీద ఆసక్తి లేనివాళ్లకు అపరిచితుడు తప్ప ఇంకో ఎంటర్ టైన్మెంట్ కనిపించడం లేదు. ఏ మేరకు వాడుకుంటాడో చూడాలి.
This post was last modified on May 15, 2024 10:00 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…