ఒకపక్క బాలీవుడ్ రామాయణంకు అడుగులు వేగంగా పడటంతో ఇంకోవైపు ఇలాంటి ఎపిక్ డ్రామాలను ప్లాన్ చేసుకున్న ఇతర హీరోలు, నిర్మాతలు అలెర్ట్ అయిపోతున్నారు. వాటిలో కర్ణ ఒకటి. సూర్య హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహరా దర్శకత్వంలో ఈ భారీ ప్యాన్ ఇండియా మూవీని ఏడాది క్రితమే ప్లాన్ చేసుకుని ఆ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చారు.
కానీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ల్యాండ్ మార్క్ మూవీ దానవీరశూరకర్ణని మరిపించేలా ఒక గొప్ప గ్రాండియర్ ఆవిష్కరించే స్థాయిలో చాలానే సెట్ చేసుకున్నారు.
కానీ బడ్జెట్ తో పాటు సూర్య డేట్లు అందుబాటులో లేకపోవడంతో ఇన్నాళ్లు మొదలుపెట్టకుండా ఆపేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చిందని సమాచారం. కొంచెం బడ్జెట్ ని సవరించి సూర్య మార్కెట్ కు తగట్టు ఖర్చు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
అయినా ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా హనుమాన్ లాంటివి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినప్పుడు సూర్య రేంజ్ హీరోని పెట్టుకుని ఎందుకు ఆలోచించాలనే దిశగా చర్యలు మొదలయ్యాయని వినికిడి. స్వర్గీయ ఎన్టీఆర్, శివాజీగణేశన్ లను తలపించేలా ఈ పాత్రను పోషించడం సూర్యకు కత్తిమీద సామే.
ప్రస్తుతం కంగువ పూర్తి చేసే పనిలో ఉన్న సూర్యకు ఆ తర్వాత వెట్రిమారన్ వడివాసల్ ఉంది. ఇవి కాకుండా లోకేష్ కనగరాజ్ తో రోలెక్స్ అనుకుంటున్నారు కానీ ఇది ఇప్పట్లో కార్యరూపం దాల్చడం అనుమానమే. ఒకవేళ కర్ణ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా అయిపోతే ఇది సెట్స్ పైకి వెళ్లొచ్చు.
కాకపోతే కొంచెం టైం పట్టేలా ఉంది. అభిమానులు మాత్రం కంగువ విడుదల తేదీ కోసం డిమాండ్ చేస్తున్నారు. 2024 రిలీజ్ అని చెప్పడమే తప్ప ఇప్పటిదాకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా దాదాపు అన్ని శుక్రవారాలు బ్లాక్ అయిన నేపథ్యంలో కంగువ ఏది తీసుకుంటుందో చూడాలి
This post was last modified on May 15, 2024 9:58 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…