సూపర్ హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన తేజ సజ్జకి హనుమాన్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. హౌస్ అరెస్ట్ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ కొచ్చిన నిరంజన్ రెడ్డి రెండో మూవీతోనే టాప్ ప్రొడ్యూసర్ గా మారడం చూస్తే అనూహ్యం అనే మాట చిన్నదే. బలమైన కంటెంట్ పడితే తేజ సజ్జ ఈజీగా నెగ్గుకొస్తాడనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది. అందుకే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా భారీ బడ్జెట్ ని మిరాయ్ మీద పెడుతున్నారు. ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే తొందరపడకుండా తేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
తాజాగా పూరి జగన్నాధ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే లైగర్ దారుణమైన డిజాస్టర్ తర్వాత హీరోలెవరూ పూరి కథలకు సుముఖత చూపించలేదు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో మాస్ బ్రేక్ ఇచ్చాడు కాబట్టే ఆ కృతజ్ఞత ప్లస్ సబ్జెక్టు మీద నమ్మకంతో రామ్ డబుల్ ఇస్మార్ట్ కు ఓకే చెప్పాడు. ఇది కూడా రకరకాల కారణాలతో ఆలస్యమవుతూనే ఉంది. ఇది విజయం సాధిస్తేనే పూరి మీద మిగిలినవాళ్లకు తిరిగి గురి కుదురుతుంది. అదేంటో జూలై దాకా ఆగితే తప్ప తెలియదు. మరి తేజ సజ్జ ఇదేమి ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది ప్రశ్న.
పూర్తి వివరాలకు ఇంకా టైం పడుతుంది కానీ తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కెరీర్ ప్రారంభంలోనే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో బాచి చేశాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ బాలనటుడిగా తేజకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి లెక్కలు వేరే ఇప్పటి బిజినెస్ అంచనాలు వేరే. తేజకు పూరి చెప్పిన స్టోరీ ఓ రేంజ్ లో ఉంటే తప్ప ఈ కాంబో సాధ్యం కాదు. ప్రస్తుతానికి అధికారిక ముద్ర లేదు కాబట్టి ఈ వార్తని గాసిప్ గానే పరిగణనలోకి తీసుకోవాలి. మిరాయ్ విడుదలకు ఇంకో ఏడాది ఉంది. సో ఈలోగా వేగంగా ఇంకో సినిమా చేసే ఆలోచనలో తేజ సజ్జ ఉన్నాడేమో లెట్ వెయిట్ అండ్ సీ.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…