సూపర్ హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన తేజ సజ్జకి హనుమాన్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. హౌస్ అరెస్ట్ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ కొచ్చిన నిరంజన్ రెడ్డి రెండో మూవీతోనే టాప్ ప్రొడ్యూసర్ గా మారడం చూస్తే అనూహ్యం అనే మాట చిన్నదే. బలమైన కంటెంట్ పడితే తేజ సజ్జ ఈజీగా నెగ్గుకొస్తాడనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది. అందుకే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా భారీ బడ్జెట్ ని మిరాయ్ మీద పెడుతున్నారు. ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే తొందరపడకుండా తేజ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
తాజాగా పూరి జగన్నాధ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే లైగర్ దారుణమైన డిజాస్టర్ తర్వాత హీరోలెవరూ పూరి కథలకు సుముఖత చూపించలేదు. ఇస్మార్ట్ శంకర్ రూపంలో మాస్ బ్రేక్ ఇచ్చాడు కాబట్టే ఆ కృతజ్ఞత ప్లస్ సబ్జెక్టు మీద నమ్మకంతో రామ్ డబుల్ ఇస్మార్ట్ కు ఓకే చెప్పాడు. ఇది కూడా రకరకాల కారణాలతో ఆలస్యమవుతూనే ఉంది. ఇది విజయం సాధిస్తేనే పూరి మీద మిగిలినవాళ్లకు తిరిగి గురి కుదురుతుంది. అదేంటో జూలై దాకా ఆగితే తప్ప తెలియదు. మరి తేజ సజ్జ ఇదేమి ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది ప్రశ్న.
పూర్తి వివరాలకు ఇంకా టైం పడుతుంది కానీ తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కెరీర్ ప్రారంభంలోనే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో బాచి చేశాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ బాలనటుడిగా తేజకు మంచి మార్కులు పడ్డాయి. అప్పటి లెక్కలు వేరే ఇప్పటి బిజినెస్ అంచనాలు వేరే. తేజకు పూరి చెప్పిన స్టోరీ ఓ రేంజ్ లో ఉంటే తప్ప ఈ కాంబో సాధ్యం కాదు. ప్రస్తుతానికి అధికారిక ముద్ర లేదు కాబట్టి ఈ వార్తని గాసిప్ గానే పరిగణనలోకి తీసుకోవాలి. మిరాయ్ విడుదలకు ఇంకో ఏడాది ఉంది. సో ఈలోగా వేగంగా ఇంకో సినిమా చేసే ఆలోచనలో తేజ సజ్జ ఉన్నాడేమో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on May 14, 2024 3:38 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…