టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. రెండు రోజుల కిందటే బన్నీ.. జనసేనాని పవన్ కళ్యాణ్కు మద్దతుగా ట్వీట్ వేసి రాబోయే ఎన్నికల్లో ఆయన కోరుకున్న విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ట్వీట్ జనసైనికులకు, మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. కొన్ని కారణాల వల్ల మెగా అభిమానుల్లో ఒక వర్గం బన్నీని కొన్నేళ్లుగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ ఎన్నికల సమయంలో బన్నీ.. పవన్కు మద్దతుగా ట్వీట్ వేయడాన్ని అందరూ స్వాగతించారు. కానీ రెండు రోజులు గడిచేసరికే కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది.
తనకు, తన భార్య స్నేహారెడ్డికి మిత్రుడైన శిల్పా రవి కోసమని బన్నీ.. నంద్యాలకు వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదని.. బన్నీ తన మిత్రుడికి అండగా నిలిచేందుకే వచ్చాడు తప్ప వైసీపీకి సపోర్ట్ ఇవ్వడానికి కాదని ఆయన మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఏ రకంగా అయినా సరే.. బన్నీ వైసీపీ కోసం ప్రచారంలో పాల్గొనాల్సింది కాదని.. కావాలంటే తన మిత్రుడికి మద్దతుగా ఒక పోస్ట్ పెట్టి ఊరుకోవాల్సిందనే అభిప్రాయాన్ని మెగా అభిమానులు, జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై బన్నీని ట్రోల్ చేస్తున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా.. శిల్పా రవికి మద్దతుగా బన్నీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వైసీపీ మద్దతుదారులు కొనియాడుతున్నారు.
బన్నీ పవన్ కోసం కేవలం ట్వీట్ మాత్రమే వేశాడని.. కానీ వైసీపీ క్యాండిడేట్ కోసం నేరుగా ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నాడని.. దీన్ని బట్టి తన ప్రయారిటీ ఎవరికి అన్నది అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నంద్యాలలో బన్నీని చూసేందుకు అభిమానులు, జనం పోటెత్తారు. దీన్ని వైసీపీ క్యాండిడేట్కు ఎలివేషన్ ఇవ్వడానికి ఆ పార్టీ వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. కానీ బన్నీని చూసేందుకు వచ్చిన జనాన్ని చూపించి వైసీపీకి అంతా బాగుందని చెప్పుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇంతకీ బన్నీ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్కు ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on May 11, 2024 5:57 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…