ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లకు బయలుదేరుతున్న వైనం ప్రతి చోటా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మీద టాలీవుడ్ సీరియస్ దృష్టి పెట్టింది. టిడిపితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కొందరు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుండగా, మరికొందరు ట్విట్టర్ వేదికగా, ఇంకొందరు తెరవెనుక వివిధ రూపాల్లో తమ ఆకాంక్షను తెలియపరుస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే పరిశ్రమకు చాలా ప్రయోజనాలుంటాయనే దిశగా ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలతో మొదలుపెట్టి తమకు పలు సందర్భాల్లో దక్కుతున్న ట్రీట్ మెంట్ పట్ల పరిశ్రమ వర్గాలు ఏపీ సర్కారు మీద ఎంతో కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. అధికారం వస్తే కనక పవన్ వైపు నుంచి టాలీవుడ్ కు మేలు జరిగే ఎన్నో సంస్కరణలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన. అందులో తప్పు బట్టేందుకు ఏం లేదు. సాటి సినిమావాడనే నమ్మకం దానికి ప్రేరేపించింది.
నిర్మాత అశ్వినీదత్ ఓపెన్ గా తెలుగుదేశంకు జై కొట్టేశారు. కల్కి మీద ప్రభావం పడుతుందా అనేంత దూరం ఆయన ఆలోచించడం లేదు. మెగా అల్లు ఫ్యామీలీలు ఆల్రెడీ తమ స్టాండ్ చెప్పేశాయి. ఎస్కెఎన్, సాయి రాజేష్, నాగవంశీ లాంటి నిర్మాతలు మేము సైతం అంటూ నేరుగా ప్రచార బరిలో దిగి జనసేనకు ఓటు వేయమని అడుగుతున్నారు. అలా అని వైసిపి మద్దతుదారులు లేరని కాదు. కానీ కూటమికి బయపడినంతగా జగన్ కు సినీ వర్గాల వైపు నుంచి మద్దతు ఆ స్థాయిలో కనిపించడం లేదన్నది వాస్తవం. చూస్తుంటే టాలీవుడ్ నమ్మకానికి కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారాయి.
This post was last modified on May 11, 2024 1:25 pm
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…