ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లకు బయలుదేరుతున్న వైనం ప్రతి చోటా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మీద టాలీవుడ్ సీరియస్ దృష్టి పెట్టింది. టిడిపితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కొందరు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుండగా, మరికొందరు ట్విట్టర్ వేదికగా, ఇంకొందరు తెరవెనుక వివిధ రూపాల్లో తమ ఆకాంక్షను తెలియపరుస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే పరిశ్రమకు చాలా ప్రయోజనాలుంటాయనే దిశగా ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలతో మొదలుపెట్టి తమకు పలు సందర్భాల్లో దక్కుతున్న ట్రీట్ మెంట్ పట్ల పరిశ్రమ వర్గాలు ఏపీ సర్కారు మీద ఎంతో కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. అధికారం వస్తే కనక పవన్ వైపు నుంచి టాలీవుడ్ కు మేలు జరిగే ఎన్నో సంస్కరణలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన. అందులో తప్పు బట్టేందుకు ఏం లేదు. సాటి సినిమావాడనే నమ్మకం దానికి ప్రేరేపించింది.
నిర్మాత అశ్వినీదత్ ఓపెన్ గా తెలుగుదేశంకు జై కొట్టేశారు. కల్కి మీద ప్రభావం పడుతుందా అనేంత దూరం ఆయన ఆలోచించడం లేదు. మెగా అల్లు ఫ్యామీలీలు ఆల్రెడీ తమ స్టాండ్ చెప్పేశాయి. ఎస్కెఎన్, సాయి రాజేష్, నాగవంశీ లాంటి నిర్మాతలు మేము సైతం అంటూ నేరుగా ప్రచార బరిలో దిగి జనసేనకు ఓటు వేయమని అడుగుతున్నారు. అలా అని వైసిపి మద్దతుదారులు లేరని కాదు. కానీ కూటమికి బయపడినంతగా జగన్ కు సినీ వర్గాల వైపు నుంచి మద్దతు ఆ స్థాయిలో కనిపించడం లేదన్నది వాస్తవం. చూస్తుంటే టాలీవుడ్ నమ్మకానికి కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారాయి.
This post was last modified on May 11, 2024 1:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…