ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లకు బయలుదేరుతున్న వైనం ప్రతి చోటా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. ఇదిలా ఉండగా ఈసారి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మీద టాలీవుడ్ సీరియస్ దృష్టి పెట్టింది. టిడిపితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కొందరు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తుండగా, మరికొందరు ట్విట్టర్ వేదికగా, ఇంకొందరు తెరవెనుక వివిధ రూపాల్లో తమ ఆకాంక్షను తెలియపరుస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వస్తే పరిశ్రమకు చాలా ప్రయోజనాలుంటాయనే దిశగా ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలతో మొదలుపెట్టి తమకు పలు సందర్భాల్లో దక్కుతున్న ట్రీట్ మెంట్ పట్ల పరిశ్రమ వర్గాలు ఏపీ సర్కారు మీద ఎంతో కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. అధికారం వస్తే కనక పవన్ వైపు నుంచి టాలీవుడ్ కు మేలు జరిగే ఎన్నో సంస్కరణలు జరుగుతాయని వాళ్ళ ఆలోచన. అందులో తప్పు బట్టేందుకు ఏం లేదు. సాటి సినిమావాడనే నమ్మకం దానికి ప్రేరేపించింది.
నిర్మాత అశ్వినీదత్ ఓపెన్ గా తెలుగుదేశంకు జై కొట్టేశారు. కల్కి మీద ప్రభావం పడుతుందా అనేంత దూరం ఆయన ఆలోచించడం లేదు. మెగా అల్లు ఫ్యామీలీలు ఆల్రెడీ తమ స్టాండ్ చెప్పేశాయి. ఎస్కెఎన్, సాయి రాజేష్, నాగవంశీ లాంటి నిర్మాతలు మేము సైతం అంటూ నేరుగా ప్రచార బరిలో దిగి జనసేనకు ఓటు వేయమని అడుగుతున్నారు. అలా అని వైసిపి మద్దతుదారులు లేరని కాదు. కానీ కూటమికి బయపడినంతగా జగన్ కు సినీ వర్గాల వైపు నుంచి మద్దతు ఆ స్థాయిలో కనిపించడం లేదన్నది వాస్తవం. చూస్తుంటే టాలీవుడ్ నమ్మకానికి కూడా ఈ ఎన్నికలు ఒక పరీక్షగా మారాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…