వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి వెళ్లిపోయింది. కారణాలు పైకి చెప్పలేదు కానీ యూనిట్ నుంచి ఆఫ్ ది రికార్డు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నికలు సోమవారంతో పూర్తవుతాయి. అయినంత మాత్రాన జనాలు వెంటనే సినిమాల మూడ్ కు వచ్చేస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా కేవలం పది రోజుల్లో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లడం జరగని పని. నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్ష ప్రచారంలో భాగం కావడంతో సితార వ్యవహారాలు చూసుకోవడానికి కొంచెం బ్రేక్ ఇచ్చారు.
దీంతో హడావిడితో రిలీజ్ చేయడం కన్నా కూల్ గా పోస్ట్ పోన్ చేద్దామనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయినా ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనేది తెలిసే నాలుగు రోజుల ముందు గ్యాంగ్స్ అఫ్ గోదావరిని రిలీజ్ చేయడం కొంచెం రిస్క్ అనిపించే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే టిడిపి జనసేన వచ్చినా లేక వైసిపి కొనసాగినా ఆ సంబరాలు కనీసం ఒక వారం పాటు పబ్లిక్ లో హంగామా చేస్తాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా థియేటర్లకు రావడమనేది అనుమానమే. అసలు మే 17 లాంటి మంచి డేట్ ని వదిలేసుకోవడం ఏమిటనే కామెంట్స్ విశ్వక్ సేన్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.
ఇంకా కథ వేరే ఉంది. మే 31 మూడు సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. సుధీర్ బాబు హరోంహర, కాజల్ అగర్వాల్ సత్యభామ, అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తిలు షెడ్యూల్ చేసుకుని ఆ మేరకు పబ్లిసిటీ కూడా చేసుకున్నాయి. ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరి హఠాత్తుగా రంగంలోకి దిగడంతో వీటిలో ఒకటో రెండో తప్పుకునే పరిస్థితి రావొచ్చు. పోనీ ఇప్పుడు విశ్వక్ టీమ్ వదిలేసిన మే 17 తీసుకుందామన్నా వాళ్లకూ ప్రమోషన్ టైం సరిపోదనే ఫిర్యాదే వస్తుంది. మొత్తానికి వాయిదాల మీద వాయిదాలతో లంకల రత్నం (విశ్వక్ పాత్ర పేరు) విపరీతంగా ఎదురు చూసేలా చేస్తున్నాడు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…