వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి వెళ్లిపోయింది. కారణాలు పైకి చెప్పలేదు కానీ యూనిట్ నుంచి ఆఫ్ ది రికార్డు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎన్నికలు సోమవారంతో పూర్తవుతాయి. అయినంత మాత్రాన జనాలు వెంటనే సినిమాల మూడ్ కు వచ్చేస్తారన్న గ్యారెంటీ లేదు. పైగా కేవలం పది రోజుల్లో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లడం జరగని పని. నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్ళిపోయి అక్కడ ప్రత్యక్ష ప్రచారంలో భాగం కావడంతో సితార వ్యవహారాలు చూసుకోవడానికి కొంచెం బ్రేక్ ఇచ్చారు.
దీంతో హడావిడితో రిలీజ్ చేయడం కన్నా కూల్ గా పోస్ట్ పోన్ చేద్దామనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయినా ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనేది తెలిసే నాలుగు రోజుల ముందు గ్యాంగ్స్ అఫ్ గోదావరిని రిలీజ్ చేయడం కొంచెం రిస్క్ అనిపించే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే టిడిపి జనసేన వచ్చినా లేక వైసిపి కొనసాగినా ఆ సంబరాలు కనీసం ఒక వారం పాటు పబ్లిక్ లో హంగామా చేస్తాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా థియేటర్లకు రావడమనేది అనుమానమే. అసలు మే 17 లాంటి మంచి డేట్ ని వదిలేసుకోవడం ఏమిటనే కామెంట్స్ విశ్వక్ సేన్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి.
ఇంకా కథ వేరే ఉంది. మే 31 మూడు సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. సుధీర్ బాబు హరోంహర, కాజల్ అగర్వాల్ సత్యభామ, అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తిలు షెడ్యూల్ చేసుకుని ఆ మేరకు పబ్లిసిటీ కూడా చేసుకున్నాయి. ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరి హఠాత్తుగా రంగంలోకి దిగడంతో వీటిలో ఒకటో రెండో తప్పుకునే పరిస్థితి రావొచ్చు. పోనీ ఇప్పుడు విశ్వక్ టీమ్ వదిలేసిన మే 17 తీసుకుందామన్నా వాళ్లకూ ప్రమోషన్ టైం సరిపోదనే ఫిర్యాదే వస్తుంది. మొత్తానికి వాయిదాల మీద వాయిదాలతో లంకల రత్నం (విశ్వక్ పాత్ర పేరు) విపరీతంగా ఎదురు చూసేలా చేస్తున్నాడు.
This post was last modified on May 9, 2024 3:11 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…