ఈసారి ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ ఆరంభానికి ముందు షో మీద జనాల్లో అంత ఆసక్తి కనిపించలేదు. ఈసారి హోస్ట్ మారకపోవడం, మళ్లీ నాగార్జునే ఆ బాధ్యత తీసుకోవడం.. కంటెస్టంట్ల జాబితా ఏమంత ఎగ్జైటింగ్గా లేకపోవడమే అందుక్కారణం.
ఐతే కరోనా వల్ల జనాలు ఒకప్పటి స్థాయిలో బయట తిరక్కపోవడం, థియేటర్లలో సినిమాలు చూసే అవకాశం లేకపోవడంతో టీవీల్లో వివిధ కార్యక్రమాలకు, సినిమాలకు రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తున్న నేపథ్యంలో ‘బిగ్ బాస్’కు కూడా రేటింగ్స్ ఎక్కువే వస్తాయని అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ ఆరంభ ఎపిసోడ్ రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసింది. సెప్టెంబరు 6న ఆదివారం ప్రసారం అయిన ‘బిగ్ బాస్-4’ లాంచింగ్ ఎపిసోడ్కు 18.5 టీఆర్పీ వచ్చింది. తెలుగు ‘బిగ్ బాస్’ చరిత్రలో ఒక ఎపిసోడ్కు వచ్చిన అత్యధిక రేటింగ్ ఇదే కావడం విశేషం.
గత ఏడాది నాగార్జునే హోస్ట్ చేసిన మూడో సీజన్ తొలి ఎపిసోడ్కు 17.9 రేటింగ్ వచ్చింది. అప్పుడు అది రికార్డు. దాన్ని తాజా ఎపిసోడ్ బీట్ చేసింది. షో ఆరంభానికి ముందు అంచనాలు తక్కువ ఉన్నప్పటికీ.. ఆరంభ ఎపిసోడ్ను జనాల అంచనాలకు మించి ఎంటర్టైనింగ్గా మలిచారు రూపకర్తలు. కంటెస్టెంట్ల ఎంట్రీ ప్లాన్ చేసిన విధానం, వాళ్ల నేపథ్యానికి సంబంధించిన వీడియోలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇద్దరు కంటెస్టంట్లను సీక్రెట్ రూంకు పంపించడం ద్వారా తొలి రోజే షోను రక్తి కట్టించారు.
ఆ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే మంచి రేటింగ్ వచ్చింది. ఇక తొలి వారం జనాలకు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చిన దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేషన్ వేటుకు గురయ్యాడు. ఐతే వెళ్తూ వెళ్తూ తన సహచరుల గురించి చక్కగా విశ్లేషించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్న సూర్యకిరణ్ అతడిని పంపించేసి తప్పు చేశామనే అభిప్రాయాన్ని వీక్షకుల్లో కలిగించాడు.
This post was last modified on September 17, 2020 12:50 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…