ఈసారి ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ ఆరంభానికి ముందు షో మీద జనాల్లో అంత ఆసక్తి కనిపించలేదు. ఈసారి హోస్ట్ మారకపోవడం, మళ్లీ నాగార్జునే ఆ బాధ్యత తీసుకోవడం.. కంటెస్టంట్ల జాబితా ఏమంత ఎగ్జైటింగ్గా లేకపోవడమే అందుక్కారణం.
ఐతే కరోనా వల్ల జనాలు ఒకప్పటి స్థాయిలో బయట తిరక్కపోవడం, థియేటర్లలో సినిమాలు చూసే అవకాశం లేకపోవడంతో టీవీల్లో వివిధ కార్యక్రమాలకు, సినిమాలకు రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తున్న నేపథ్యంలో ‘బిగ్ బాస్’కు కూడా రేటింగ్స్ ఎక్కువే వస్తాయని అంచనా వేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ ఆరంభ ఎపిసోడ్ రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసింది. సెప్టెంబరు 6న ఆదివారం ప్రసారం అయిన ‘బిగ్ బాస్-4’ లాంచింగ్ ఎపిసోడ్కు 18.5 టీఆర్పీ వచ్చింది. తెలుగు ‘బిగ్ బాస్’ చరిత్రలో ఒక ఎపిసోడ్కు వచ్చిన అత్యధిక రేటింగ్ ఇదే కావడం విశేషం.
గత ఏడాది నాగార్జునే హోస్ట్ చేసిన మూడో సీజన్ తొలి ఎపిసోడ్కు 17.9 రేటింగ్ వచ్చింది. అప్పుడు అది రికార్డు. దాన్ని తాజా ఎపిసోడ్ బీట్ చేసింది. షో ఆరంభానికి ముందు అంచనాలు తక్కువ ఉన్నప్పటికీ.. ఆరంభ ఎపిసోడ్ను జనాల అంచనాలకు మించి ఎంటర్టైనింగ్గా మలిచారు రూపకర్తలు. కంటెస్టెంట్ల ఎంట్రీ ప్లాన్ చేసిన విధానం, వాళ్ల నేపథ్యానికి సంబంధించిన వీడియోలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇద్దరు కంటెస్టంట్లను సీక్రెట్ రూంకు పంపించడం ద్వారా తొలి రోజే షోను రక్తి కట్టించారు.
ఆ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే మంచి రేటింగ్ వచ్చింది. ఇక తొలి వారం జనాలకు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చిన దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేషన్ వేటుకు గురయ్యాడు. ఐతే వెళ్తూ వెళ్తూ తన సహచరుల గురించి చక్కగా విశ్లేషించడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్న సూర్యకిరణ్ అతడిని పంపించేసి తప్పు చేశామనే అభిప్రాయాన్ని వీక్షకుల్లో కలిగించాడు.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…