సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి పనికైనా సిద్ధపడటం ఈ మధ్య కనిపిస్తోంది. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ రచయిత ఒకరు దివంగత నటులు, హీరోయిన్లు మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్ల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. చివరికాయన బహిరంగ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇలాంటి ఉదంతమే మరొకటి బాలీవుడ్ లోనూ జరిగింది. దాని బారిన పడింది కరణ్ జోహార్.
తాజాగా ఓ శాటిలైట్ ఛానల్ కు సంబంధించిన కామెడీ షోలో హాస్య నటుడు కేతన్ సింగ్ అచ్చం కరణ్ జోహార్ ని మిమిక్రీ చేస్తూ ఆయన హావభావాలను చూపించే ప్రయత్నంలో కొంత ఓవరాక్షన్ చేశాడు. ఈ ప్రోమో కాస్తా వైరలయ్యింది. దీంతో స్వయంగా కరణ్ స్పందిస్తూ ముక్కు మొహం తెలియని యూట్యూబర్లు మీమర్లు చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ ఇలా పరిశ్రమలోనే ఉండే వ్యక్తులు, మీడియా సంస్థలు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి చూస్తుండగా టీవీలో యాడ్ వచ్చిందని, తనకేం చెప్పాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పాతిక సంవత్సరాల సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు. దీంతో వ్యవహారం ముదిరింది గుర్తించిన కేతన్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పేశారు. కరణ్ జోహార్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అవమానించాలని చేయలేదని, జరిగినదానికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి సిగరెట్ కు నిప్పు వెలిగించబోతే కొంప అంటుకున్నట్టు అయ్యింది. ఆ మధ్య తెలుగులోనూ ఒక స్టార్ హీరో విషయంలో ఇలాగే జరిగితే సదరు హాస్య నటుడికి ఫ్యాన్స్ రోడ్డు మీదే దేహశుద్ధి చేయడం తెలిసిందే.
This post was last modified on May 7, 2024 10:20 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…