సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి పనికైనా సిద్ధపడటం ఈ మధ్య కనిపిస్తోంది. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ రచయిత ఒకరు దివంగత నటులు, హీరోయిన్లు మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్ల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. చివరికాయన బహిరంగ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇలాంటి ఉదంతమే మరొకటి బాలీవుడ్ లోనూ జరిగింది. దాని బారిన పడింది కరణ్ జోహార్.
తాజాగా ఓ శాటిలైట్ ఛానల్ కు సంబంధించిన కామెడీ షోలో హాస్య నటుడు కేతన్ సింగ్ అచ్చం కరణ్ జోహార్ ని మిమిక్రీ చేస్తూ ఆయన హావభావాలను చూపించే ప్రయత్నంలో కొంత ఓవరాక్షన్ చేశాడు. ఈ ప్రోమో కాస్తా వైరలయ్యింది. దీంతో స్వయంగా కరణ్ స్పందిస్తూ ముక్కు మొహం తెలియని యూట్యూబర్లు మీమర్లు చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ ఇలా పరిశ్రమలోనే ఉండే వ్యక్తులు, మీడియా సంస్థలు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి చూస్తుండగా టీవీలో యాడ్ వచ్చిందని, తనకేం చెప్పాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పాతిక సంవత్సరాల సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు. దీంతో వ్యవహారం ముదిరింది గుర్తించిన కేతన్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పేశారు. కరణ్ జోహార్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అవమానించాలని చేయలేదని, జరిగినదానికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి సిగరెట్ కు నిప్పు వెలిగించబోతే కొంప అంటుకున్నట్టు అయ్యింది. ఆ మధ్య తెలుగులోనూ ఒక స్టార్ హీరో విషయంలో ఇలాగే జరిగితే సదరు హాస్య నటుడికి ఫ్యాన్స్ రోడ్డు మీదే దేహశుద్ధి చేయడం తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…