సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి పనికైనా సిద్ధపడటం ఈ మధ్య కనిపిస్తోంది. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ రచయిత ఒకరు దివంగత నటులు, హీరోయిన్లు మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్ల పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. చివరికాయన బహిరంగ క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇలాంటి ఉదంతమే మరొకటి బాలీవుడ్ లోనూ జరిగింది. దాని బారిన పడింది కరణ్ జోహార్.
తాజాగా ఓ శాటిలైట్ ఛానల్ కు సంబంధించిన కామెడీ షోలో హాస్య నటుడు కేతన్ సింగ్ అచ్చం కరణ్ జోహార్ ని మిమిక్రీ చేస్తూ ఆయన హావభావాలను చూపించే ప్రయత్నంలో కొంత ఓవరాక్షన్ చేశాడు. ఈ ప్రోమో కాస్తా వైరలయ్యింది. దీంతో స్వయంగా కరణ్ స్పందిస్తూ ముక్కు మొహం తెలియని యూట్యూబర్లు మీమర్లు చేస్తే ఏదో అనుకోవచ్చు కానీ ఇలా పరిశ్రమలోనే ఉండే వ్యక్తులు, మీడియా సంస్థలు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి చూస్తుండగా టీవీలో యాడ్ వచ్చిందని, తనకేం చెప్పాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పాతిక సంవత్సరాల సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన తనకే ఇలా జరిగితే ఇక సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు. దీంతో వ్యవహారం ముదిరింది గుర్తించిన కేతన్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పేశారు. కరణ్ జోహార్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అవమానించాలని చేయలేదని, జరిగినదానికి మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నానని వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి సిగరెట్ కు నిప్పు వెలిగించబోతే కొంప అంటుకున్నట్టు అయ్యింది. ఆ మధ్య తెలుగులోనూ ఒక స్టార్ హీరో విషయంలో ఇలాగే జరిగితే సదరు హాస్య నటుడికి ఫ్యాన్స్ రోడ్డు మీదే దేహశుద్ధి చేయడం తెలిసిందే.
This post was last modified on May 7, 2024 10:20 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…