కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఈసారి అన్ని కలిసి వచ్చేలా ఉన్నాయి. నిజానికి హిందీలో తనకు స్టార్ల సరసన అవకాశాలు అట్టే దక్కడం లేదు. పైగా రెగ్యులర్ గా డ్యూయెట్లు పాడే ధోరణికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకోవడంతో ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలనే ఎంచుకుంటోంది. తెలుగులో ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన రెండు వేర్వేరు సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసి డబుల్ జాక్ పాటు కొట్టేసింది.
హిందీలో మాత్రం జాన్వీ కపూర్ కంటెంట్ ఉన్న లైనప్ నే ఎంచుకోవడం గమనార్హం. రాజ్ కుమార్ రావు సరసన చేసిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఈ నెలాఖరున విడుదల కానుంది. వరుణ్ ధావన్ జంటగా సన్నీ సంస్కారికి తులసి కుమారి ఈ వేసవిలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. గుల్షన్ దేవయ్యతో నటించిన ఉల్జా జూలై అయిదున థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇక తారక్ దేవర పార్ట్ 1 అక్టోబర్ పదిన రిలీజయ్యాక రెండో భాగం ఎప్పటి నుంచి ఉంటుందనే దాన్ని బట్టి కాల్ షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆర్సి 16 జూలై లేదా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్ళిపోతుంది.
గ్లామర్ రోల్స్ కి దూరంగా ఇలా ఇన్ని మంచి అవకాశాలు దక్కడం అరుదే. దేవర, ఆర్సి 16 రెండూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. పల్లెటూరి తరహా నేపధ్యాలతోనే సాగుతాయి. అందుకే హీరోల ఇమేజ్ తో పాటు కథలో ఉన్న దమ్ము తనకు కెరీర్ పరంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవి కనక హిట్ అయితే శ్రీలీల ఇచ్చిన గ్యాప్ తో పాటు రష్మిక మందన్న లాంటి వాళ్ళు ఎక్కువ తెలుగు సినిమాలు చేయలేకపోతున్న అవకాశాన్ని జాన్వీ కపూర్ వాడుకోవచ్చు. ఇవి కాకుండా మరో రెండు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్లు ఉన్నాయట కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
This post was last modified on May 7, 2024 11:14 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…