కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఈసారి అన్ని కలిసి వచ్చేలా ఉన్నాయి. నిజానికి హిందీలో తనకు స్టార్ల సరసన అవకాశాలు అట్టే దక్కడం లేదు. పైగా రెగ్యులర్ గా డ్యూయెట్లు పాడే ధోరణికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకోవడంతో ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలనే ఎంచుకుంటోంది. తెలుగులో ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన రెండు వేర్వేరు సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసి డబుల్ జాక్ పాటు కొట్టేసింది.
హిందీలో మాత్రం జాన్వీ కపూర్ కంటెంట్ ఉన్న లైనప్ నే ఎంచుకోవడం గమనార్హం. రాజ్ కుమార్ రావు సరసన చేసిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ ఈ నెలాఖరున విడుదల కానుంది. వరుణ్ ధావన్ జంటగా సన్నీ సంస్కారికి తులసి కుమారి ఈ వేసవిలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. గుల్షన్ దేవయ్యతో నటించిన ఉల్జా జూలై అయిదున థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇక తారక్ దేవర పార్ట్ 1 అక్టోబర్ పదిన రిలీజయ్యాక రెండో భాగం ఎప్పటి నుంచి ఉంటుందనే దాన్ని బట్టి కాల్ షీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆర్సి 16 జూలై లేదా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్ళిపోతుంది.
గ్లామర్ రోల్స్ కి దూరంగా ఇలా ఇన్ని మంచి అవకాశాలు దక్కడం అరుదే. దేవర, ఆర్సి 16 రెండూ నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. పల్లెటూరి తరహా నేపధ్యాలతోనే సాగుతాయి. అందుకే హీరోల ఇమేజ్ తో పాటు కథలో ఉన్న దమ్ము తనకు కెరీర్ పరంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవి కనక హిట్ అయితే శ్రీలీల ఇచ్చిన గ్యాప్ తో పాటు రష్మిక మందన్న లాంటి వాళ్ళు ఎక్కువ తెలుగు సినిమాలు చేయలేకపోతున్న అవకాశాన్ని జాన్వీ కపూర్ వాడుకోవచ్చు. ఇవి కాకుండా మరో రెండు టాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్లు ఉన్నాయట కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
This post was last modified on May 7, 2024 11:14 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…