Movie News

క‌మ‌ల్ హాస‌న్ ఆ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడితో..

మ‌న సందీప్ కిష‌న్ హీరోగా త‌మిళంలో మాన‌గ‌రం అనే థ్రిల్ల‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు యువ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. తెలుగులో న‌గ‌రం పేరుతో రిలీజైన ఆ చిత్రం ఇక్క‌డ అంత‌గా ఆడ‌లేదు కానీ.. త‌మిళంలో మాత్రం మంచి విజ‌య‌మే సాధించింది. ఐతే లోకేష్ స‌త్తా ఏంటో అన్ని భాష‌ల వాళ్ల‌కూ చాటిచెప్పిన చిత్రం అంటే.. ఖైదీనే.

కార్తీ హీరోగా అత‌ను రూపొందించిన ఆ చిత్రం గ‌త ఏడాది సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. అందులోని భావోద్వేగాలు, ఉత్కంఠ‌, సెంటిమెంటుకు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోకేష్‌కు విజ‌య్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవ‌కాశం తెచ్చిపెట్టింది. వీళ్ల క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన మాస్ట‌ర్ విడుద‌ల కోసం ఎదురు చూస్తోంది.

ఈ లోపే లోకేష్‌కు మ‌రో పెద్ద అవ‌కాశం వ‌చ్చింది. అత‌ను లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా సినిమా చేయ‌బోతుండటం విశేషం. ఈ సినిమా గురించి ఓ ప్రి లుక్ ద్వారా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఒక‌ప్పుడు ఒక ద‌య్యం ఉండేది అనే క్యాప్ష‌న్‌తో తుపాకుల‌తో క‌మ‌ల్ రూపాన్ని తీర్చిదిద్దిన ఒక ఇంట్రెస్టింగ్ లుక్‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని క‌మ‌ల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌నల్ నిర్మిస్తుండ‌టం విశేషం. 2021 వేస‌విలో విడుద‌ల అంటూ పోస్ట‌ర్ మీద ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తి రేకెత్తించేదే. ఇంకో 8 నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌బోతుండ‌గా.. ఇండియ‌న్‌-2 పెండింగ్‌లో ఉన్న ఈ స‌మ‌యంలో లోకేష్‌తో సినిమా అనౌన్స్ చేసి 2021 వేస‌వి విడుద‌ల అని క‌మ‌ల్ ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్యక‌రం. కాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో తెలుగులో ఓ సినిమా చేయ‌డానికి లోకేష్ క‌మిట్మెంట్ ఇవ్వ‌డం విశేషం.

This post was last modified on September 17, 2020 12:17 pm

Share

Recent Posts

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

6 minutes ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

22 minutes ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

56 minutes ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

1 hour ago

30 ఏళ్ల కింద‌ట శంకుస్థాప‌న చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. 30 ఏళ్ల కింద‌ట తాను చేసిన శంకు స్థాప‌న తాలూకు…

2 hours ago

అమెరికా వెళ్ల‌కుండానే పెట్టుబ‌డులు తెచ్చుకోవ‌చ్చు

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యం లో…

2 hours ago