మన సందీప్ కిషన్ హీరోగా తమిళంలో మానగరం అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో నగరం పేరుతో రిలీజైన ఆ చిత్రం ఇక్కడ అంతగా ఆడలేదు కానీ.. తమిళంలో మాత్రం మంచి విజయమే సాధించింది. ఐతే లోకేష్ సత్తా ఏంటో అన్ని భాషల వాళ్లకూ చాటిచెప్పిన చిత్రం అంటే.. ఖైదీనే.
కార్తీ హీరోగా అతను రూపొందించిన ఆ చిత్రం గత ఏడాది సెన్సేషనల్ హిట్టయింది. అందులోని భావోద్వేగాలు, ఉత్కంఠ, సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోకేష్కు విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం తెచ్చిపెట్టింది. వీళ్ల కలయికలో తెరకెక్కిన మాస్టర్ విడుదల కోసం ఎదురు చూస్తోంది.
ఈ లోపే లోకేష్కు మరో పెద్ద అవకాశం వచ్చింది. అతను లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా సినిమా చేయబోతుండటం విశేషం. ఈ సినిమా గురించి ఓ ప్రి లుక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు ఒక దయ్యం ఉండేది అనే క్యాప్షన్తో తుపాకులతో కమల్ రూపాన్ని తీర్చిదిద్దిన ఒక ఇంట్రెస్టింగ్ లుక్ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండటం విశేషం. 2021 వేసవిలో విడుదల అంటూ పోస్టర్ మీద ప్రకటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఇంకో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుండగా.. ఇండియన్-2 పెండింగ్లో ఉన్న ఈ సమయంలో లోకేష్తో సినిమా అనౌన్స్ చేసి 2021 వేసవి విడుదల అని కమల్ ప్రకటించడం ఆశ్చర్యకరం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగులో ఓ సినిమా చేయడానికి లోకేష్ కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.
This post was last modified on September 17, 2020 12:17 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…