మన సందీప్ కిషన్ హీరోగా తమిళంలో మానగరం అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో నగరం పేరుతో రిలీజైన ఆ చిత్రం ఇక్కడ అంతగా ఆడలేదు కానీ.. తమిళంలో మాత్రం మంచి విజయమే సాధించింది. ఐతే లోకేష్ సత్తా ఏంటో అన్ని భాషల వాళ్లకూ చాటిచెప్పిన చిత్రం అంటే.. ఖైదీనే.
కార్తీ హీరోగా అతను రూపొందించిన ఆ చిత్రం గత ఏడాది సెన్సేషనల్ హిట్టయింది. అందులోని భావోద్వేగాలు, ఉత్కంఠ, సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోకేష్కు విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం తెచ్చిపెట్టింది. వీళ్ల కలయికలో తెరకెక్కిన మాస్టర్ విడుదల కోసం ఎదురు చూస్తోంది.
ఈ లోపే లోకేష్కు మరో పెద్ద అవకాశం వచ్చింది. అతను లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా సినిమా చేయబోతుండటం విశేషం. ఈ సినిమా గురించి ఓ ప్రి లుక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు ఒక దయ్యం ఉండేది అనే క్యాప్షన్తో తుపాకులతో కమల్ రూపాన్ని తీర్చిదిద్దిన ఒక ఇంట్రెస్టింగ్ లుక్ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండటం విశేషం. 2021 వేసవిలో విడుదల అంటూ పోస్టర్ మీద ప్రకటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఇంకో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుండగా.. ఇండియన్-2 పెండింగ్లో ఉన్న ఈ సమయంలో లోకేష్తో సినిమా అనౌన్స్ చేసి 2021 వేసవి విడుదల అని కమల్ ప్రకటించడం ఆశ్చర్యకరం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగులో ఓ సినిమా చేయడానికి లోకేష్ కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.
This post was last modified on September 17, 2020 12:17 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…