మన సందీప్ కిషన్ హీరోగా తమిళంలో మానగరం అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో నగరం పేరుతో రిలీజైన ఆ చిత్రం ఇక్కడ అంతగా ఆడలేదు కానీ.. తమిళంలో మాత్రం మంచి విజయమే సాధించింది. ఐతే లోకేష్ సత్తా ఏంటో అన్ని భాషల వాళ్లకూ చాటిచెప్పిన చిత్రం అంటే.. ఖైదీనే.
కార్తీ హీరోగా అతను రూపొందించిన ఆ చిత్రం గత ఏడాది సెన్సేషనల్ హిట్టయింది. అందులోని భావోద్వేగాలు, ఉత్కంఠ, సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోకేష్కు విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం తెచ్చిపెట్టింది. వీళ్ల కలయికలో తెరకెక్కిన మాస్టర్ విడుదల కోసం ఎదురు చూస్తోంది.
ఈ లోపే లోకేష్కు మరో పెద్ద అవకాశం వచ్చింది. అతను లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా సినిమా చేయబోతుండటం విశేషం. ఈ సినిమా గురించి ఓ ప్రి లుక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు ఒక దయ్యం ఉండేది అనే క్యాప్షన్తో తుపాకులతో కమల్ రూపాన్ని తీర్చిదిద్దిన ఒక ఇంట్రెస్టింగ్ లుక్ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండటం విశేషం. 2021 వేసవిలో విడుదల అంటూ పోస్టర్ మీద ప్రకటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఇంకో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుండగా.. ఇండియన్-2 పెండింగ్లో ఉన్న ఈ సమయంలో లోకేష్తో సినిమా అనౌన్స్ చేసి 2021 వేసవి విడుదల అని కమల్ ప్రకటించడం ఆశ్చర్యకరం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగులో ఓ సినిమా చేయడానికి లోకేష్ కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…