మన సందీప్ కిషన్ హీరోగా తమిళంలో మానగరం అనే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. తెలుగులో నగరం పేరుతో రిలీజైన ఆ చిత్రం ఇక్కడ అంతగా ఆడలేదు కానీ.. తమిళంలో మాత్రం మంచి విజయమే సాధించింది. ఐతే లోకేష్ సత్తా ఏంటో అన్ని భాషల వాళ్లకూ చాటిచెప్పిన చిత్రం అంటే.. ఖైదీనే.
కార్తీ హీరోగా అతను రూపొందించిన ఆ చిత్రం గత ఏడాది సెన్సేషనల్ హిట్టయింది. అందులోని భావోద్వేగాలు, ఉత్కంఠ, సెంటిమెంటుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా లోకేష్కు విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం తెచ్చిపెట్టింది. వీళ్ల కలయికలో తెరకెక్కిన మాస్టర్ విడుదల కోసం ఎదురు చూస్తోంది.
ఈ లోపే లోకేష్కు మరో పెద్ద అవకాశం వచ్చింది. అతను లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా సినిమా చేయబోతుండటం విశేషం. ఈ సినిమా గురించి ఓ ప్రి లుక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకప్పుడు ఒక దయ్యం ఉండేది అనే క్యాప్షన్తో తుపాకులతో కమల్ రూపాన్ని తీర్చిదిద్దిన ఒక ఇంట్రెస్టింగ్ లుక్ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండటం విశేషం. 2021 వేసవిలో విడుదల అంటూ పోస్టర్ మీద ప్రకటించడం ఆసక్తి రేకెత్తించేదే. ఇంకో 8 నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతుండగా.. ఇండియన్-2 పెండింగ్లో ఉన్న ఈ సమయంలో లోకేష్తో సినిమా అనౌన్స్ చేసి 2021 వేసవి విడుదల అని కమల్ ప్రకటించడం ఆశ్చర్యకరం. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగులో ఓ సినిమా చేయడానికి లోకేష్ కమిట్మెంట్ ఇవ్వడం విశేషం.
తాజాగా విడుదలైన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర మీద సోషల్ మీడియాలో గట్టి చర్చే జరుగుతోంది. అసలామె క్యారెక్టర్ ని…
ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. అది కూడా కొత్త వాళ్లతో ఒక ప్రేమకథ చేసిన వాడు.. మెగా పవర్…
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం…