Movie News

విక్ర‌మ్ కొడుకు.. క్రేజీ మూవీ

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో చేసిన రెండు సినిమాల‌తోనే చాలా ప్రామిసింగ్‌గా అనిపించిన వార‌సుల్లో ధ్రువ్ విక్ర‌మ్ ఒక‌డు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వ‌ర్మ‌తో హీరోగా ప‌రిచ‌య‌మై తొలి మూవీతోనే హిట్ కొట్టిన అత‌ను.. రెండో చిత్రం మ‌హాన్‌లో తండ్రి విక్ర‌మ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఆయ‌న‌కు దీటుగా న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నాయి.

మ‌హాన్‌లో ధ్రువ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌డికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌న్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపించాయి. ఈ సినిమా త‌ర్వాత కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించ‌డానికి ధ్రువ్ చాలా టైం తీసుకున్నాడు. ఎట్ట‌కేల‌కు దాని గురించి అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ధ్రువ్ మూడో చిత్రం క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్క‌బోతోంది.

తొలి చిత్రం ప‌రియేరుం పెరుమాల్‌తో జాతీయ అవార్డు సాధించ‌డ‌మే కాక‌.. ఆ త‌ర్వాత క‌ర్ణ‌న్, మామ‌న్న‌న్ లాంటి క్లాసిక్స్ అందించిన మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ధ్రువ్ న‌టించ‌బోతున్నాడు. మారి సెల్వ‌రాజ్ గురువైన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా.రంజిత్ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌బోతోంది. మంచి పెర్ఫామ‌ర్‌గా పేరు తెచ్చుకున్న ధ్రువ్ ప‌క్క‌న అనుప‌మ మంచి జోడీ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా లాంచ్ చేసిన ప్రి లుక్ పోస్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ మార్కును సూచించేలా ఉంది. అత‌ను మ‌రోసారి బ‌ల‌మైన కాన్సెప్ట్‌తో రాబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. మారి లాంటి మేటి ద‌ర్శ‌కుడితో జ‌ట్టు క‌ట్టాడంటే ధ్రువ్ పెర్ఫామెన్స్ అదిరిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on May 6, 2024 7:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

2 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago