సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయమై తొలి మూవీతోనే హిట్ కొట్టిన అతను.. రెండో చిత్రం మహాన్లో తండ్రి విక్రమ్తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఆయనకు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నాయి.
మహాన్లో ధ్రువ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడికి మంచి భవిష్యత్ ఉందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపించాయి. ఈ సినిమా తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించడానికి ధ్రువ్ చాలా టైం తీసుకున్నాడు. ఎట్టకేలకు దాని గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. ధ్రువ్ మూడో చిత్రం క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతోంది.
తొలి చిత్రం పరియేరుం పెరుమాల్తో జాతీయ అవార్డు సాధించడమే కాక.. ఆ తర్వాత కర్ణన్, మామన్నన్ లాంటి క్లాసిక్స్ అందించిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ నటించబోతున్నాడు. మారి సెల్వరాజ్ గురువైన ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించబోతోంది. మంచి పెర్ఫామర్గా పేరు తెచ్చుకున్న ధ్రువ్ పక్కన అనుపమ మంచి జోడీ అవుతుందనడంలో సందేహం లేదు.
ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా లాంచ్ చేసిన ప్రి లుక్ పోస్టర్ మారి సెల్వరాజ్ మార్కును సూచించేలా ఉంది. అతను మరోసారి బలమైన కాన్సెప్ట్తో రాబోతున్నాడని అర్థమవుతోంది. మారి లాంటి మేటి దర్శకుడితో జట్టు కట్టాడంటే ధ్రువ్ పెర్ఫామెన్స్ అదిరిపోతుందనడంలో సందేహం లేదు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…