ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఫహద్ ఫాసిల్ మాస్ విశ్వరూపానికి కేరళలో ఏకంగా వంద కోట్ల దిశగా పరుగులు పెట్టడం ట్రేడ్ ని విస్మయపరిచింది. పుష్ప విలన్ గా మనకు సుపరిచితుడైపోయిన ఫహద్ ఫాసిల్ ని మ్యాచ్ చేసే నటుడు ఎవరితోనైనా తెలుగులో రీమేక్ జరిగితే బాగుంటుందనే ఆలోచన పలువురు నిర్మాతల్లో కలిగింది. ట్విస్ట్ ఏంటంటే అనుకున్న టైం కన్నా ముందుగా ఇది ఓటిటిలో రాబోతోందని లేటెస్ట్ అప్డేట్. అది కూడా వచ్చే వారమే.
అమెజాన్ ప్రైమ్ వేదికగా మే 9 నుంచి ఆవేశం స్ట్రీమింగ్ ఉంటుందని అనధికార సమాచారం. ఇలాంటి వార్తలు ఊరికే పుట్టుకురావు. తొంబై శాతం సందర్భాల్లో నిజమే అయ్యాయి. అయితే కేవలం ఒక భాషలోనే వస్తుందా లేక మల్టీ లాంగ్వేజెస్ లో అనునదిస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చాకే తెలుస్తుంది. కామెడీ టచ్ ఉన్న మాస్ రౌడీగా ఫహద్ ఫాసిల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. నాలుగో వారంలోకి అడుగు పెడుతున్నా హైదరాబాద్ లో ఇంకా సబ్ టైటిల్స్ తో ఆడిస్తున్నారంటే ఏ రేంజ్ లో ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జీతూ మాధవన్ కి పెద్ద పేరొచ్చింది.
ఒకవేళ ఎవరైనా టాలీవుడ్ స్టార్ రీమేక్ చేయాలనుకున్నా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్. గతంలో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ లాంటివి ఈ ఓటిటిల వల్లే ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితాలు అందుకోలేదు. కారణం డిజిటల్ లో సులభంగా అందుబాటులో ఉండటమే. అసలు ఏ గొడవ లేకుండా ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ తరహాలో డైరెక్ట్ గా డబ్బింగ్ చేస్తే ఏ సమస్యా ఉండదు. లేదూ హక్కులు కొని మనోళ్లతోనే తీయాలని ఎవరైనా నిర్మాత ప్రయత్నిస్తే బాగానే ఉంటుంది కానీ జాప్యం చేయకుండా ఉంటే బెటర్. పుష్ప, ఆవేశం దెబ్బకు ఫహద్ ఫాసిల్ డిమాండ్ మాములుగా లేదు.
This post was last modified on May 4, 2024 11:15 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…