ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఫహద్ ఫాసిల్ మాస్ విశ్వరూపానికి కేరళలో ఏకంగా వంద కోట్ల దిశగా పరుగులు పెట్టడం ట్రేడ్ ని విస్మయపరిచింది. పుష్ప విలన్ గా మనకు సుపరిచితుడైపోయిన ఫహద్ ఫాసిల్ ని మ్యాచ్ చేసే నటుడు ఎవరితోనైనా తెలుగులో రీమేక్ జరిగితే బాగుంటుందనే ఆలోచన పలువురు నిర్మాతల్లో కలిగింది. ట్విస్ట్ ఏంటంటే అనుకున్న టైం కన్నా ముందుగా ఇది ఓటిటిలో రాబోతోందని లేటెస్ట్ అప్డేట్. అది కూడా వచ్చే వారమే.
అమెజాన్ ప్రైమ్ వేదికగా మే 9 నుంచి ఆవేశం స్ట్రీమింగ్ ఉంటుందని అనధికార సమాచారం. ఇలాంటి వార్తలు ఊరికే పుట్టుకురావు. తొంబై శాతం సందర్భాల్లో నిజమే అయ్యాయి. అయితే కేవలం ఒక భాషలోనే వస్తుందా లేక మల్టీ లాంగ్వేజెస్ లో అనునదిస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చాకే తెలుస్తుంది. కామెడీ టచ్ ఉన్న మాస్ రౌడీగా ఫహద్ ఫాసిల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. నాలుగో వారంలోకి అడుగు పెడుతున్నా హైదరాబాద్ లో ఇంకా సబ్ టైటిల్స్ తో ఆడిస్తున్నారంటే ఏ రేంజ్ లో ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జీతూ మాధవన్ కి పెద్ద పేరొచ్చింది.
ఒకవేళ ఎవరైనా టాలీవుడ్ స్టార్ రీమేక్ చేయాలనుకున్నా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్. గతంలో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ లాంటివి ఈ ఓటిటిల వల్లే ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితాలు అందుకోలేదు. కారణం డిజిటల్ లో సులభంగా అందుబాటులో ఉండటమే. అసలు ఏ గొడవ లేకుండా ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ తరహాలో డైరెక్ట్ గా డబ్బింగ్ చేస్తే ఏ సమస్యా ఉండదు. లేదూ హక్కులు కొని మనోళ్లతోనే తీయాలని ఎవరైనా నిర్మాత ప్రయత్నిస్తే బాగానే ఉంటుంది కానీ జాప్యం చేయకుండా ఉంటే బెటర్. పుష్ప, ఆవేశం దెబ్బకు ఫహద్ ఫాసిల్ డిమాండ్ మాములుగా లేదు.
This post was last modified on May 4, 2024 11:15 am
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…