Movie News

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు ఖర్చు పెడతారు. రాహుల్ సంకృత్యాన్ ఈ బాపతే. న్యాచురల్ స్టార్ నానితో 2021 శ్యామ్ సింగ రాయ్ చేశాక మళ్ళీ ఇంకో మూవీ మొదలుపెట్టలేదు. అది మంచి విజయంతో పాటు అవార్డులు తీసుకొచ్చినా సరే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరో కోసం ప్రయత్నించాడనే టాక్ వచ్చింది కానీ తర్వాత దాని గురించి ఎలాంటి ఊసు లేకుండా పోయింది. ఫైనల్ గా తన కాంబోని సెట్ చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్.

విజయ్ దేవరకొండతో ఒక ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కలయిక టాక్సీవాలా వచ్చింది. రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో పైరసీ వెర్షన్ లీకైనప్పటికీ మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా గీత గోవిందం స్థాయి కాకపోయినా దీనికైన బడ్జెట్ కు తగ్గట్టుగా లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాహుల్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రౌడీ బాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిపోవడంతో మైత్రి నిర్మాణంలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. డియర్ కామ్రేడ్, ఖుషి తర్వాత మూడోసారి చేతులు కలుపుతున్నారు.

ప్రస్తుతం రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి సినిమాలో బిజీగా ఉన్నాడు. ఒక ఆరు నెలలు దీని మీద సీరియస్ గా వర్క్ జరుగుతుంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించే మరో సినిమా వచ్చే వారం లాంఛనంగా ప్రకటించబోతున్నారు. రౌడీ జనార్దన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇవి అయ్యాకే రాహుల్ సంకృత్యాన్ మూవీ పట్టాలు ఎక్కొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ది ఫ్యామిలీ స్టార్ తీవ్రంగా నిరాశ పరచడంతో విజయ్ దేవరకొండ కొత్త స్క్రిప్ట్ ల మీద మరింత శ్రద్ధ పెడుతున్నాడు. మార్కెట్ మళ్ళీ బలపడాలంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం. అది ఎవరు ఇస్తారో చూడాలి. 

This post was last modified on May 2, 2024 6:26 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

1 hour ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

2 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

2 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

2 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

3 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

4 hours ago