వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రేపు రిలీజవుతున్న వాటిలో ఫ్యామిలీ యాంగిల్ లో కనిపిస్తున్నది ఆ ఒక్కటి అడక్కు మాత్రమే. అల్లరి నరేష్ సీరియస్ జానర్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఫుల్ లెన్త్ కామెడీతో వస్తున్నాడు. ఇప్పటిదాకా పని చేసిన 32 మందిలో దీని దర్శకుడు మల్లి మాత్రమే టెన్షన్ లేకుండా కూల్ గా కనిపించాడని అంత నమ్మకం ఉందని బలంగా చెప్పుకొచ్చాడు. ఇది ఎందుకు పరీక్షగా మారుతోందో ఓసారి చూద్దాం.
తిరిగి ఎంటర్ టైన్మెంట్ రూట్ పట్టాక అల్లరి నరేష్ సీరియస్ గా హాస్య కథల వైపు దృష్టి పెడుతున్నాడు. అందులో భాగంగానే సుడిగాడు 2ని ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా, బచ్చల మల్లిలో నవ్వులకు పెద్ద పీఠ వేయిస్తున్నాడు. తండ్రి ఈవీవీ తీసిన క్లాసిక్స్ అప్పుల అప్పారావు, జంబలకిడిపంబ లాంటి వాటిని రీమేక్ చేయడమో లేదా కొనసాగింపు తీయించే ఆలోచనలు గట్టిగా చేస్తున్నాడు. ఇవన్నీ ముందడుగు వేయాలంటే ఇప్పుడీ ఆ ఒక్కటి అడక్కు హిట్టు కొట్టడం చాలా అవసరం, నాంది మినహాయించి సోలో హీరోగా తనకు సక్సెస్ దక్కి చాలా గ్యాప్ వచ్చేసింది.
అదీ కాకుండా జబర్దస్త్ జోకులకు అలవాటు పడిపోయి థియేటర్ కామెడీ ఛాలెంజ్ గా మారిన తరుణంలో అల్లరి నరేష్ కెరీర్ కు ఆ ఒక్కటి అడక్కు బూస్ట్ ఇవ్వడం చాలా అవసరం. వెంకటేష్ మల్లేశ్వరి తరహా పాయింట్ తీసుకున్నప్పటికీ ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయట. అల్లరోడి కబుర్లు కాసేపు పక్కనపెడితే ఇది విజయవంతం కావడం వల్ల మళ్ళీ థియేటర్లలో జనాలు కనపడతారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేకపోయినా టాక్ వస్తే చాలు సామజవరగమనలాగా ఒకటి రెండు ఆటల్లోపే అమాంతం పికప్ చూపించే స్టామినా ఇలాంటి సినిమాలకు ఉంటుంది.
This post was last modified on May 2, 2024 6:01 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…