వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రేపు రిలీజవుతున్న వాటిలో ఫ్యామిలీ యాంగిల్ లో కనిపిస్తున్నది ఆ ఒక్కటి అడక్కు మాత్రమే. అల్లరి నరేష్ సీరియస్ జానర్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఫుల్ లెన్త్ కామెడీతో వస్తున్నాడు. ఇప్పటిదాకా పని చేసిన 32 మందిలో దీని దర్శకుడు మల్లి మాత్రమే టెన్షన్ లేకుండా కూల్ గా కనిపించాడని అంత నమ్మకం ఉందని బలంగా చెప్పుకొచ్చాడు. ఇది ఎందుకు పరీక్షగా మారుతోందో ఓసారి చూద్దాం.
తిరిగి ఎంటర్ టైన్మెంట్ రూట్ పట్టాక అల్లరి నరేష్ సీరియస్ గా హాస్య కథల వైపు దృష్టి పెడుతున్నాడు. అందులో భాగంగానే సుడిగాడు 2ని ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా, బచ్చల మల్లిలో నవ్వులకు పెద్ద పీఠ వేయిస్తున్నాడు. తండ్రి ఈవీవీ తీసిన క్లాసిక్స్ అప్పుల అప్పారావు, జంబలకిడిపంబ లాంటి వాటిని రీమేక్ చేయడమో లేదా కొనసాగింపు తీయించే ఆలోచనలు గట్టిగా చేస్తున్నాడు. ఇవన్నీ ముందడుగు వేయాలంటే ఇప్పుడీ ఆ ఒక్కటి అడక్కు హిట్టు కొట్టడం చాలా అవసరం, నాంది మినహాయించి సోలో హీరోగా తనకు సక్సెస్ దక్కి చాలా గ్యాప్ వచ్చేసింది.
అదీ కాకుండా జబర్దస్త్ జోకులకు అలవాటు పడిపోయి థియేటర్ కామెడీ ఛాలెంజ్ గా మారిన తరుణంలో అల్లరి నరేష్ కెరీర్ కు ఆ ఒక్కటి అడక్కు బూస్ట్ ఇవ్వడం చాలా అవసరం. వెంకటేష్ మల్లేశ్వరి తరహా పాయింట్ తీసుకున్నప్పటికీ ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయట. అల్లరోడి కబుర్లు కాసేపు పక్కనపెడితే ఇది విజయవంతం కావడం వల్ల మళ్ళీ థియేటర్లలో జనాలు కనపడతారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేకపోయినా టాక్ వస్తే చాలు సామజవరగమనలాగా ఒకటి రెండు ఆటల్లోపే అమాంతం పికప్ చూపించే స్టామినా ఇలాంటి సినిమాలకు ఉంటుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…