వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు విజయ్. అందులో గౌతమ్ తిన్ననూరి చిత్రం ఎప్పుడో అనౌన్స్ చేసింది. త్వరలోనే దాని షూటింగ్కు హాజరు కాబోతున్నాడు.
మరోవైపు ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా లైన్లో ఉంది. ఆ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపాడు. అది ‘ట్యాక్సీవాలా’ తర్వాత రాహుల్ సంకృత్యన్ విజయ్తో తీయబోయే సినిమా.
‘ట్యాక్సీవాలా’తో ఘనవిజయాన్నందుకున్న రాహుల్.. ఆ తర్వాత నానితో చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ కూడా బాగా ఆడింది. తొలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్.. మూడో చిత్రం విషయంలోనూ అదే చేస్తున్నాడు. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదలైన రెండేళ్ల తర్వాతే తన తర్వాతి సినిమాను మొదలుపెడుతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈసారి అతను రాయలసీమ నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామా తీయబోతున్నాడట.
పక్కా తెలంగాణ హీరోగా గుర్తింపు పొందిన విజయ్.. ఇప్పటిదాకా ఆంధ్ర, సీమ యాసల్లో డైలాగులు చెప్పింది లేదు. అతను రాయలసీమ భాష, యాసలో మాట్లాడితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విజయ్కి అది సూటవుతుందా అన్న సందేహాలున్నాయి కానీ.. మంచి పెర్ఫామర్ అయిన విజయ్ ఆ పనిని పర్ఫెక్ట్గానే చేస్తాడని ఆశించవచ్చు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతోందట.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…