వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ మూడు సినిమాలు లైన్లో పెట్టాడు విజయ్. అందులో గౌతమ్ తిన్ననూరి చిత్రం ఎప్పుడో అనౌన్స్ చేసింది. త్వరలోనే దాని షూటింగ్కు హాజరు కాబోతున్నాడు.
మరోవైపు ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా లైన్లో ఉంది. ఆ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపాడు. అది ‘ట్యాక్సీవాలా’ తర్వాత రాహుల్ సంకృత్యన్ విజయ్తో తీయబోయే సినిమా.
‘ట్యాక్సీవాలా’తో ఘనవిజయాన్నందుకున్న రాహుల్.. ఆ తర్వాత నానితో చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ కూడా బాగా ఆడింది. తొలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్.. మూడో చిత్రం విషయంలోనూ అదే చేస్తున్నాడు. ‘శ్యామ్ సింగరాయ్’ విడుదలైన రెండేళ్ల తర్వాతే తన తర్వాతి సినిమాను మొదలుపెడుతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈసారి అతను రాయలసీమ నేపథ్యంలో ఒక పీరియడ్ డ్రామా తీయబోతున్నాడట.
పక్కా తెలంగాణ హీరోగా గుర్తింపు పొందిన విజయ్.. ఇప్పటిదాకా ఆంధ్ర, సీమ యాసల్లో డైలాగులు చెప్పింది లేదు. అతను రాయలసీమ భాష, యాసలో మాట్లాడితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విజయ్కి అది సూటవుతుందా అన్న సందేహాలున్నాయి కానీ.. మంచి పెర్ఫామర్ అయిన విజయ్ ఆ పనిని పర్ఫెక్ట్గానే చేస్తాడని ఆశించవచ్చు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతోందట.
This post was last modified on May 1, 2024 2:25 pm
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…