పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అగ్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా గురించి ఇప్పటిదాకా అధికారికంగా ఏ చిన్న అప్ డేట్ లేదు. ఏ హడావుడి లేకుండా జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి ఒకట్రెండు ఫొటోలు మాత్రమే బయటికి వచ్చాయి.
అంతే తప్ప ఇలా ఓ సినిమా మొదలుపెట్టామని.. ఇందులో వీళ్లు వీళ్లు నటిస్తారని.. దీని కథ ఇదని.. టైటిల్ ఇదని.. ఇలా ఏ సమాచారాన్నీ చిత్ర బృందం పంచుకోలేదు. కానీ ఆ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని.. ఇందులో పవన్ దొంగ పాత్ర పోషిస్తున్నాడని అన్నారు. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.
ఇక కాస్టింగ్ విషయంలోనూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తమిళ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కోలీవుడ్లో అడుగు పెట్టి పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్.
తమిళ హీరోలందరికీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుంటుంది. అలా చాలామందే ఇక్కడ మార్కెట్ సంపాదించారు. కార్తికేయన్ కూడా డబ్బింగ్ సినిమాలతో ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో నటిస్తే తెలుగులో కచ్చితంగా అతడికి మంచి గుర్తింపే లభిస్తుంది. అతడి టాలెంట్కు తగ్గ పాత్రనే క్రిష్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడంలో భాగంగా తమిళం నుంచి శివను తీసుకున్నట్లు చెబుతున్నారు. తమిళ హీరోయినే అయిన నివేథా పెతురాజ్ కూడా ఇందులో ఓ పాత్ర చేయనుందట. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల్ని కవర్ చేయడం కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను లీడ్ హీరోయిన్గా తీసుకున్నట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…