పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అగ్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా గురించి ఇప్పటిదాకా అధికారికంగా ఏ చిన్న అప్ డేట్ లేదు. ఏ హడావుడి లేకుండా జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి ఒకట్రెండు ఫొటోలు మాత్రమే బయటికి వచ్చాయి.
అంతే తప్ప ఇలా ఓ సినిమా మొదలుపెట్టామని.. ఇందులో వీళ్లు వీళ్లు నటిస్తారని.. దీని కథ ఇదని.. టైటిల్ ఇదని.. ఇలా ఏ సమాచారాన్నీ చిత్ర బృందం పంచుకోలేదు. కానీ ఆ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని.. ఇందులో పవన్ దొంగ పాత్ర పోషిస్తున్నాడని అన్నారు. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.
ఇక కాస్టింగ్ విషయంలోనూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తమిళ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కోలీవుడ్లో అడుగు పెట్టి పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్.
తమిళ హీరోలందరికీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుంటుంది. అలా చాలామందే ఇక్కడ మార్కెట్ సంపాదించారు. కార్తికేయన్ కూడా డబ్బింగ్ సినిమాలతో ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో నటిస్తే తెలుగులో కచ్చితంగా అతడికి మంచి గుర్తింపే లభిస్తుంది. అతడి టాలెంట్కు తగ్గ పాత్రనే క్రిష్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడంలో భాగంగా తమిళం నుంచి శివను తీసుకున్నట్లు చెబుతున్నారు. తమిళ హీరోయినే అయిన నివేథా పెతురాజ్ కూడా ఇందులో ఓ పాత్ర చేయనుందట. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల్ని కవర్ చేయడం కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను లీడ్ హీరోయిన్గా తీసుకున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on April 27, 2020 5:37 pm
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…