పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అగ్ర దర్శకుడు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా గురించి ఇప్పటిదాకా అధికారికంగా ఏ చిన్న అప్ డేట్ లేదు. ఏ హడావుడి లేకుండా జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి ఒకట్రెండు ఫొటోలు మాత్రమే బయటికి వచ్చాయి.
అంతే తప్ప ఇలా ఓ సినిమా మొదలుపెట్టామని.. ఇందులో వీళ్లు వీళ్లు నటిస్తారని.. దీని కథ ఇదని.. టైటిల్ ఇదని.. ఇలా ఏ సమాచారాన్నీ చిత్ర బృందం పంచుకోలేదు. కానీ ఆ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని.. ఇందులో పవన్ దొంగ పాత్ర పోషిస్తున్నాడని అన్నారు. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.
ఇక కాస్టింగ్ విషయంలోనూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ తమిళ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కోలీవుడ్లో అడుగు పెట్టి పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్.
తమిళ హీరోలందరికీ తెలుగులో మార్కెట్ పెంచుకోవాలనుంటుంది. అలా చాలామందే ఇక్కడ మార్కెట్ సంపాదించారు. కార్తికేయన్ కూడా డబ్బింగ్ సినిమాలతో ట్రై చేశాడు కానీ.. వర్కవుట్ కాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలో నటిస్తే తెలుగులో కచ్చితంగా అతడికి మంచి గుర్తింపే లభిస్తుంది. అతడి టాలెంట్కు తగ్గ పాత్రనే క్రిష్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడంలో భాగంగా తమిళం నుంచి శివను తీసుకున్నట్లు చెబుతున్నారు. తమిళ హీరోయినే అయిన నివేథా పెతురాజ్ కూడా ఇందులో ఓ పాత్ర చేయనుందట. ఇక బాలీవుడ్ ప్రేక్షకుల్ని కవర్ చేయడం కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను లీడ్ హీరోయిన్గా తీసుకున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on April 27, 2020 5:37 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…