2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. మే 9 నుంచి ఈ సినిమా వాయిదా పడగా.. కొత్త డేట్ జూన్ 27కు ఖరారైంది. ఇక మళ్లీ వాయిదాల్లాంటివి ఏమీ ఉండకపోవచ్చు.
ఆ రోజు ‘కల్కి’ రావడం పక్కా. ఇక ఈ ఏడాదిలో రావాల్సిన వేరే భారీ చిత్రాలన్నింటికీ ఆల్రెడీ డేట్లు ఖరారయ్యాయి. అల్లు అర్జున్-సుకుమార్ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ ఆగస్టు 15న విడుదల కానుండగా.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ అక్టోబరు 10కి ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ సైతం సెప్టెంబరు 27కు రిలీజ్ ఖాయం చేసుకుంది.
ఇక తెలుగులో డేట్ ఖరారు కావాల్సిన ఏకైక భారీ చిత్రం.. ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మూడేళ్ల కిందట మొదలైన ఈ చిత్రం.. ఎంతకీ పూర్తి కావట్లేదు. కొన్ని నెలల పాటు షూటింగ్ ఆగాక రెండు నెలల కిందటే మళ్లీ షూట్ పున:ప్రారంభించి చకచకా సినిమాను పూర్తి చేసే పనిలో పడింది లేదు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల సంగతి అంతా చూసుకుని రిలీజ్ డేట్ ఖరారు చేయాల్సి ఉంది. అక్టోబరు డేట్ పరిశీలిస్తున్నారు.
కానీ ఆ నెలలో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉంది. ‘దేవర’తో పాటు రజినీ మూవీ ‘వేట్టయాన్’, సూర్య చిత్రం ‘కంగువ’ కూడా ఆ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. మరి ‘గేమ్ చేంజర్’ కోసం ఏ డేట్ ఎంచుకుంటారో చూడాలి. ‘గేమ్ చేంజర్’ షూట్ పూర్తయ్యాక శంకర్ గ్యాప్ తీసుకుని ‘ఇండియన్-2’ రిలీజ్ సంగతి చూడనున్నాడు. ఆ చిత్రం జూన్లోనే రిలీజ్ కానుంది. అది విడుదలయ్యాక ‘గేమ్ చేంజర్’ డేట్ ఫిక్స్ చేస్తారేమో.
This post was last modified on April 28, 2024 7:36 pm
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…