2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. మే 9 నుంచి ఈ సినిమా వాయిదా పడగా.. కొత్త డేట్ జూన్ 27కు ఖరారైంది. ఇక మళ్లీ వాయిదాల్లాంటివి ఏమీ ఉండకపోవచ్చు.
ఆ రోజు ‘కల్కి’ రావడం పక్కా. ఇక ఈ ఏడాదిలో రావాల్సిన వేరే భారీ చిత్రాలన్నింటికీ ఆల్రెడీ డేట్లు ఖరారయ్యాయి. అల్లు అర్జున్-సుకుమార్ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ ఆగస్టు 15న విడుదల కానుండగా.. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ అక్టోబరు 10కి ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ సైతం సెప్టెంబరు 27కు రిలీజ్ ఖాయం చేసుకుంది.
ఇక తెలుగులో డేట్ ఖరారు కావాల్సిన ఏకైక భారీ చిత్రం.. ‘గేమ్ చేంజర్’ మాత్రమే. మూడేళ్ల కిందట మొదలైన ఈ చిత్రం.. ఎంతకీ పూర్తి కావట్లేదు. కొన్ని నెలల పాటు షూటింగ్ ఆగాక రెండు నెలల కిందటే మళ్లీ షూట్ పున:ప్రారంభించి చకచకా సినిమాను పూర్తి చేసే పనిలో పడింది లేదు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల సంగతి అంతా చూసుకుని రిలీజ్ డేట్ ఖరారు చేయాల్సి ఉంది. అక్టోబరు డేట్ పరిశీలిస్తున్నారు.
కానీ ఆ నెలలో ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉంది. ‘దేవర’తో పాటు రజినీ మూవీ ‘వేట్టయాన్’, సూర్య చిత్రం ‘కంగువ’ కూడా ఆ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. మరి ‘గేమ్ చేంజర్’ కోసం ఏ డేట్ ఎంచుకుంటారో చూడాలి. ‘గేమ్ చేంజర్’ షూట్ పూర్తయ్యాక శంకర్ గ్యాప్ తీసుకుని ‘ఇండియన్-2’ రిలీజ్ సంగతి చూడనున్నాడు. ఆ చిత్రం జూన్లోనే రిలీజ్ కానుంది. అది విడుదలయ్యాక ‘గేమ్ చేంజర్’ డేట్ ఫిక్స్ చేస్తారేమో.
This post was last modified on April 28, 2024 7:36 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…