పాత టైటిల్స్ వాడుకోవడం కొత్తేమి కాదు కానీ ఇప్పుడదే ట్రెండ్ గా మారుతోంది. నిర్మాణంలో ఉన్న తమ్ముడు, సుందరకాండ వగైరాలన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కోసం దర్శకుడు అనుదీప్ అలాంటి పేరునే తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే ఎంటర్ టైనర్ కు దాదాపు ఇది ఫిక్స్ అయినట్టేనని టాక్. 1992 లో మోహన్ బాబు హీరోగా దొంగ పోలీస్ వచ్చింది. కెమెరామెన్ కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహించగా మమతా కులకర్ణి హీరోయిన్. బప్పీలహరి సంగీతం. కమర్షియల్ గా పే చేసింది కానీ కలెక్షన్ కింగ్ రేంజ్ లో ఆడలేదు.
తర్వాత 2013లో నిఖిల్ నటించిన ఇంకో దొంగ పోలీస్ వచ్చింది కానీ అది ప్రేక్షకుల దృష్టికి రానంతగా ఫ్లాప్ అయ్యింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మాస్ రాజా కోసం వాడుతున్నారు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్ కు తమిళంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ రూపంలో మంచి ఛాన్స్ దక్కింది. అయితే అది రెండు భాషల్లో అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో ఈసారి దొంగ పోలీస్ కోసం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. రవితేజ మార్క్ వినోదంతో పాటు కమర్షియల్ టచ్ బలంగా ఇస్తున్నట్టు తెలిసింది. విక్రమార్కుడు రేంజ్ దొంగగా మాస్ రాజా దర్శనమిస్తాడట.
ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ మొత్తం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడో అంతు చిక్కడం లేదు. వేగంగా పూర్తి చేయడంతో పాటు బిజినెస్ పరంగా మంచి మార్కెటింగ్ చేయడంతో మాస్ మహారాజా వీళ్ళతోనే చేసేందుకు ఎక్కువ సుముఖత చూపిస్తున్నాడు. ధమాకా నుంచి ఈ బాండింగ్ బాగా బలపడింది. స్పీడ్ విషయంలో రవితేజ తగ్గేదేలే అంటున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఫలితాలు నిరాశపరిచినప్పటికే మిస్టర్ బచ్చన్ మాత్రం మంచి కంబ్యాక్ అయ్యేలా ఉంది. హిందీ సూపర్ హిట్ రైడ్ అధికారిక రీమేక్ ఇది.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…