Movie News

మాస్ మహారాజా సినిమాకు మోహన్ బాబు టైటిల్

పాత టైటిల్స్ వాడుకోవడం కొత్తేమి కాదు కానీ ఇప్పుడదే ట్రెండ్ గా మారుతోంది. నిర్మాణంలో ఉన్న తమ్ముడు, సుందరకాండ వగైరాలన్నీ అదే క్యాటగిరీలోకి వస్తాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కోసం దర్శకుడు అనుదీప్ అలాంటి పేరునే తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోయే ఎంటర్ టైనర్ కు దాదాపు ఇది ఫిక్స్ అయినట్టేనని టాక్. 1992 లో మోహన్ బాబు హీరోగా దొంగ పోలీస్ వచ్చింది. కెమెరామెన్ కెఎస్ ప్రకాష్ దర్శకత్వం వహించగా మమతా కులకర్ణి హీరోయిన్. బప్పీలహరి సంగీతం. కమర్షియల్ గా పే చేసింది కానీ కలెక్షన్ కింగ్ రేంజ్ లో ఆడలేదు.

తర్వాత 2013లో నిఖిల్ నటించిన ఇంకో దొంగ పోలీస్ వచ్చింది కానీ అది ప్రేక్షకుల దృష్టికి రానంతగా ఫ్లాప్ అయ్యింది. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మాస్ రాజా కోసం వాడుతున్నారు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్ కు తమిళంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ రూపంలో మంచి ఛాన్స్ దక్కింది. అయితే అది రెండు భాషల్లో అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో ఈసారి దొంగ పోలీస్ కోసం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. రవితేజ మార్క్ వినోదంతో పాటు కమర్షియల్ టచ్ బలంగా ఇస్తున్నట్టు తెలిసింది. విక్రమార్కుడు రేంజ్ దొంగగా మాస్ రాజా దర్శనమిస్తాడట.

ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ మొత్తం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడో అంతు చిక్కడం లేదు. వేగంగా పూర్తి చేయడంతో పాటు బిజినెస్ పరంగా మంచి మార్కెటింగ్ చేయడంతో మాస్ మహారాజా వీళ్ళతోనే చేసేందుకు ఎక్కువ సుముఖత చూపిస్తున్నాడు. ధమాకా నుంచి ఈ బాండింగ్ బాగా బలపడింది. స్పీడ్ విషయంలో రవితేజ తగ్గేదేలే అంటున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఫలితాలు నిరాశపరిచినప్పటికే మిస్టర్ బచ్చన్ మాత్రం మంచి కంబ్యాక్ అయ్యేలా ఉంది. హిందీ సూపర్ హిట్ రైడ్ అధికారిక రీమేక్ ఇది.

This post was last modified on April 25, 2024 1:20 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago