విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విపరీతంగా నెమ్మదించేశాడు. దాని మొదటి యానివర్సరీ జరిగిపోయినా సరే తేజ్ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. బ్రో ఆనందం పరిమితంగానే మిగిలింది. కలర్స్ స్వాతితో చేసిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం సత్య ప్రమోషన్లలో తప్ప బయట కనిపించడం లేదు. సితార బ్యానర్ లో నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో అధికారికంగా అనౌన్స్ చేశాక ఆగిపోవడం వెనుక బడ్జెట్ కారణాలని వినిపిస్తోంది కానీ నిజానిజాలు మాట్లాడేందుకు టీమ్ లో ఎవరూ సిద్ధంగా లేరు.
ఇప్పుడు దీని స్థానంలో సాయి దుర్గ తేజ్ రోహిత్ అనే కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హనుమాన్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో సంస్థలో దీన్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే ప్రియదర్శి నభ నటేష్ కాంబోలో డార్లింగ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇప్పుడు తేజు ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేశారట. వచ్చే నెల లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, జానర్ బయటికి చెప్పకపోయినా యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో సాగుతుందని టాక్.
క్రమంగా సాయి దుర్గ తేజ్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చింది. పోటీ పెరిగిపోయి మెగా హీరోలు వెనుకబడుతున్నారు. తమ్ముడు వైష్ణవ్ తేజ్ వరసగా మూడు డిజాస్టర్లు మూటగట్టుకుని మార్కెట్ ని రిస్క్ లో పడేశాడు. వరుణ్ తేజ్ నేనేం తక్కువాని హ్యాట్రిక్ సూపర్ ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. చేతిలో హిట్ ఉన్న సాయి తేజ్ మాత్రం నెలల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు. మావయ్య పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో గొప్ప క్లాసిక్ గా నిలిచిపోతుందనుకుంటే ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెట్టాడంటే కంటెంట్ ఏదో బలంగానే ఉందనుకోవాలి.
This post was last modified on April 25, 2024 11:27 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…