Movie News

గాంజా పక్కకు కొత్త దర్శకుడు ముందుకు

విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విపరీతంగా నెమ్మదించేశాడు. దాని మొదటి యానివర్సరీ జరిగిపోయినా సరే తేజ్ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. బ్రో ఆనందం పరిమితంగానే మిగిలింది. కలర్స్ స్వాతితో చేసిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం సత్య ప్రమోషన్లలో తప్ప బయట కనిపించడం లేదు. సితార బ్యానర్ లో నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో అధికారికంగా అనౌన్స్ చేశాక ఆగిపోవడం వెనుక బడ్జెట్ కారణాలని వినిపిస్తోంది కానీ నిజానిజాలు మాట్లాడేందుకు టీమ్ లో ఎవరూ సిద్ధంగా లేరు.

ఇప్పుడు దీని స్థానంలో సాయి దుర్గ తేజ్ రోహిత్ అనే కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హనుమాన్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో సంస్థలో దీన్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే ప్రియదర్శి నభ నటేష్ కాంబోలో డార్లింగ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇప్పుడు తేజు ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేశారట. వచ్చే నెల లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, జానర్ బయటికి చెప్పకపోయినా యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో సాగుతుందని టాక్.

క్రమంగా సాయి దుర్గ తేజ్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చింది. పోటీ పెరిగిపోయి మెగా హీరోలు వెనుకబడుతున్నారు. తమ్ముడు వైష్ణవ్ తేజ్ వరసగా మూడు డిజాస్టర్లు మూటగట్టుకుని మార్కెట్ ని రిస్క్ లో పడేశాడు. వరుణ్ తేజ్ నేనేం తక్కువాని హ్యాట్రిక్ సూపర్ ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. చేతిలో హిట్ ఉన్న సాయి తేజ్ మాత్రం నెలల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు. మావయ్య పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో గొప్ప క్లాసిక్ గా నిలిచిపోతుందనుకుంటే ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెట్టాడంటే కంటెంట్ ఏదో బలంగానే ఉందనుకోవాలి.

This post was last modified on April 25, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

29 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago