Movie News

గాంజా పక్కకు కొత్త దర్శకుడు ముందుకు

విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ విపరీతంగా నెమ్మదించేశాడు. దాని మొదటి యానివర్సరీ జరిగిపోయినా సరే తేజ్ మాత్రం ఖాళీగానే ఉన్నాడు. బ్రో ఆనందం పరిమితంగానే మిగిలింది. కలర్స్ స్వాతితో చేసిన అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిం సత్య ప్రమోషన్లలో తప్ప బయట కనిపించడం లేదు. సితార బ్యానర్ లో నెలల క్రితం ప్రకటించిన గాంజా శంకర్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో అధికారికంగా అనౌన్స్ చేశాక ఆగిపోవడం వెనుక బడ్జెట్ కారణాలని వినిపిస్తోంది కానీ నిజానిజాలు మాట్లాడేందుకు టీమ్ లో ఎవరూ సిద్ధంగా లేరు.

ఇప్పుడు దీని స్థానంలో సాయి దుర్గ తేజ్ రోహిత్ అనే కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హనుమాన్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో సంస్థలో దీన్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే ప్రియదర్శి నభ నటేష్ కాంబోలో డార్లింగ్ ప్రకటించిన కొద్దిరోజులకే ఇప్పుడు తేజు ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేశారట. వచ్చే నెల లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, జానర్ బయటికి చెప్పకపోయినా యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో సాగుతుందని టాక్.

క్రమంగా సాయి దుర్గ తేజ్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చింది. పోటీ పెరిగిపోయి మెగా హీరోలు వెనుకబడుతున్నారు. తమ్ముడు వైష్ణవ్ తేజ్ వరసగా మూడు డిజాస్టర్లు మూటగట్టుకుని మార్కెట్ ని రిస్క్ లో పడేశాడు. వరుణ్ తేజ్ నేనేం తక్కువాని హ్యాట్రిక్ సూపర్ ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. చేతిలో హిట్ ఉన్న సాయి తేజ్ మాత్రం నెలల తరబడి సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు. మావయ్య పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో గొప్ప క్లాసిక్ గా నిలిచిపోతుందనుకుంటే ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ మీద ఇంత నమ్మకం పెట్టాడంటే కంటెంట్ ఏదో బలంగానే ఉందనుకోవాలి.

This post was last modified on April 25, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

20 minutes ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

29 minutes ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

35 minutes ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

2 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

3 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

4 hours ago