ఎల్లుండి విడుదల కావాల్సిన ప్రతినిధి 2 వాయిదా పడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇరవై రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నారా రోహిత్ మూవీకి మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా పోస్ట్ పోన్ కావడం ఊహించని పరిణామం. బయటికి చెప్పని కారణాలతో సెన్సార్ అధికారులు సినిమా చూసేందుకు సమయం కేటాయించకపోవడం వల్ల సర్టిఫికెట్ రాలేదని, అందువల్లే తప్పుకోవాల్సి వచ్చిందని యూనిట్ నుంచి వినిపిస్తున్న అనఫీషియల్ టాక్. టీవీ5 మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ట్రైలర్ తర్వాత బజ్ పెరిగింది.
ఏది ఏమైనా ప్రతినిధి 2 మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేక థియేటర్లు ఆలో లక్ష్మణ అంటున్నాయి. ఇలాంటి టైంలో కాస్త గుర్తింపున్న రోహిత్ లాంటి హీరోల నుంచి ప్రామిసింగ్ మూవీ వస్తోందంటే పబ్లిక్ ఖచ్చితంగా వస్తారు. మార్నింగ్ షోలు అమాంతం ఫుల్ కాకపోయినా టాక్ విన్నాక పికపయ్యే అవకాశాలు బోలెడు. అయితే రోహిత్ నేపధ్యం నేరుగా తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉండటంతో ఆ కోణంలో సెన్సార్ బోర్డు ఏమైనా సంశయపడ్డారేమో తెలియదు. చూశాక అభ్యంతరాలు చెప్పినా బాగుండేది కానీ ఇలా జరగడం ఊహించనిది.
తర్వాత ఆప్షన్ మే 3 ఉంది కానీ అప్పటికి రావడం కూడా అనుమానమేనని ఇన్ సైడ్ టాక్. ఎన్నికలు 13వ తేదీ జరుగుతాయి. ఒకవేళ సెన్సార్ నుంచి కంటెంట్ పరంగా ఏమైనా అబ్జెక్షన్ వచ్చినా, మార్పులు చేర్పులు సూచించినా లేక మొత్తానికే రివైజింగ్ కమిటీకి పంపించినా దానికి టైం పడుతుంది. సో కేవలం ఎనిమిది రోజుల్లో ఇదంత తేలే మ్యాటర్ కాదు. ఒకవేళ వందల కోట్లు ముడిపడిన స్టార్ హీరో మూవీ అయితే వేరే ఉండేది కానీ రోహిత్ విషయంలో అంత దూకుడు చూపించలేరు. మరి ప్రతినిధి 2 బృందం ఎలాంటి ఆలోచనలో ఉన్నారో రెండు మూడు రోజులు ఆగాక క్లారిటీ రావొచ్చు.
This post was last modified on April 23, 2024 6:20 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…