సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందబోయే భారీ చిత్రం తాలూకు అప్డేట్స్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. హీరోయిజంకి గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో తలైవర్ ఏ రేంజ్ లో కనిపిస్తాడోని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ వారంలోనే టైటిల్ రివీల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 80 దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న లోకేష్ ఈసారి రజని క్యారెక్టరైజేషన్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూపించని తరహాలో చాలా ప్రయోగాలు చేయబోతున్నాడట.
అసలు పాయింట్ కు వస్తే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కింగ్ నాగార్జునని సంప్రదించినట్టు తెలిసింది. ప్రాధమికంగా చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందట. మల్టీస్టారర్స్ చేసేందుకు ఈ మధ్య కాలంలో నాగ్ ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ కుబేరలో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు. సో అల్లుడు తర్వాత ఇప్పుడు మామ కాంబోకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన లాంటివేం రాలేదు కానీ సోర్స్ అయితే బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం రజని వెట్టాయన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అక్టోబర్ రిలీజ్ చెప్పేశారు కనక షూట్ వేగం పెంచారు. లోకేష్ ది వేసవి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్తారు. రజని, నాగ్ లు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. గతంలో ఈ ఇద్దరూ ఒకే కథతో 1991లో శాంతి క్రాంతిలో నటించారు. తెలుగులో నాగ్, తమిళంలో రజనీకాంత్ చేశారు. కలిసి స్క్రీన్ ని పంచుకునే ఛాన్స్ దక్కలేదు. ఇన్నేళ్లకు అది సాధ్యమైతే ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ అవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ భారీ చిత్రానికి సన్ పిక్చర్స్ నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెడుతోందని చెన్నై టాక్.
This post was last modified on April 21, 2024 10:21 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…