సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందబోయే భారీ చిత్రం తాలూకు అప్డేట్స్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. హీరోయిజంకి గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో తలైవర్ ఏ రేంజ్ లో కనిపిస్తాడోని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ వారంలోనే టైటిల్ రివీల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 80 దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న లోకేష్ ఈసారి రజని క్యారెక్టరైజేషన్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూపించని తరహాలో చాలా ప్రయోగాలు చేయబోతున్నాడట.
అసలు పాయింట్ కు వస్తే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కింగ్ నాగార్జునని సంప్రదించినట్టు తెలిసింది. ప్రాధమికంగా చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందట. మల్టీస్టారర్స్ చేసేందుకు ఈ మధ్య కాలంలో నాగ్ ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ కుబేరలో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు. సో అల్లుడు తర్వాత ఇప్పుడు మామ కాంబోకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన లాంటివేం రాలేదు కానీ సోర్స్ అయితే బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం రజని వెట్టాయన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అక్టోబర్ రిలీజ్ చెప్పేశారు కనక షూట్ వేగం పెంచారు. లోకేష్ ది వేసవి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్తారు. రజని, నాగ్ లు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. గతంలో ఈ ఇద్దరూ ఒకే కథతో 1991లో శాంతి క్రాంతిలో నటించారు. తెలుగులో నాగ్, తమిళంలో రజనీకాంత్ చేశారు. కలిసి స్క్రీన్ ని పంచుకునే ఛాన్స్ దక్కలేదు. ఇన్నేళ్లకు అది సాధ్యమైతే ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ అవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ భారీ చిత్రానికి సన్ పిక్చర్స్ నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెడుతోందని చెన్నై టాక్.
This post was last modified on April 21, 2024 10:21 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…