సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందబోయే భారీ చిత్రం తాలూకు అప్డేట్స్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. హీరోయిజంకి గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో తలైవర్ ఏ రేంజ్ లో కనిపిస్తాడోని అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ వారంలోనే టైటిల్ రివీల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 80 దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న లోకేష్ ఈసారి రజని క్యారెక్టరైజేషన్ పరంగా ఇప్పటిదాకా ఎవరూ చూపించని తరహాలో చాలా ప్రయోగాలు చేయబోతున్నాడట.
అసలు పాయింట్ కు వస్తే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం కింగ్ నాగార్జునని సంప్రదించినట్టు తెలిసింది. ప్రాధమికంగా చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందట. మల్టీస్టారర్స్ చేసేందుకు ఈ మధ్య కాలంలో నాగ్ ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ కుబేరలో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు. సో అల్లుడు తర్వాత ఇప్పుడు మామ కాంబోకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన లాంటివేం రాలేదు కానీ సోర్స్ అయితే బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం రజని వెట్టాయన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అక్టోబర్ రిలీజ్ చెప్పేశారు కనక షూట్ వేగం పెంచారు. లోకేష్ ది వేసవి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్తారు. రజని, నాగ్ లు కలిసి నటిస్తే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. గతంలో ఈ ఇద్దరూ ఒకే కథతో 1991లో శాంతి క్రాంతిలో నటించారు. తెలుగులో నాగ్, తమిళంలో రజనీకాంత్ చేశారు. కలిసి స్క్రీన్ ని పంచుకునే ఛాన్స్ దక్కలేదు. ఇన్నేళ్లకు అది సాధ్యమైతే ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్ అవుతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ భారీ చిత్రానికి సన్ పిక్చర్స్ నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెడుతోందని చెన్నై టాక్.
This post was last modified on April 21, 2024 10:21 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…