ఏదో యధాలాపంగా లేదా ముఖాముఖీలో అవతలి వ్యక్తి అడిగాడని ఏదేదో మాట్లాడేస్తే సోషల్ మీడియా వ్యవహారాలు ఒక్కోసారి చాలా దూరం వెళ్లిపోతాయి. తాజాగా జరిగిన ఉదంతమే మంచి ఉదాహరణ. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె నాయుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామయ్య వస్తావయ్యా చేస్తున్న టైంలో దర్శకుడు హరీష్ శంకర్ వల్ల ఇబ్బంది పడ్డానని, చెప్పిన మాట వినకుండా అలా ఇలా అని సతాయిస్తే సరేలేనని ఆయన చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోయానని చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకునే తత్వం హరీష్ లో లేదనే కోణంలో ఈ మాటలు బయటికి వెళ్లాయి.
దీంతో ఎక్స్ వేదికగా హరీష్ శంకర్ స్వయంగా స్పందించాడు. ఛోటాను ఉద్దేశించి మెసేజ్ పెడుతూ వందకు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చిన తాను ఏనాడూ మీ గురించి నెగటివ్ గా మాట్లాడలేదని, రామయ్య వస్తావయ్యా టైంలో వేరే కెమెరామెన్ ని పెట్టుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు దిల్ రాజు గారి మాట మీద, గబ్బర్ సింగ్ తర్వాత గర్వం వచ్చిందనుకుంటారనే ఉద్దేశంతో ఇబ్బంది పడుతూనే మీతో షూట్ చేసుకున్నానని వివరించాడు. యాంకర్ అడగకపోయినా తన గురించి అవమానంగా మాట్లాడ్డం పట్ల హరీష్ శంకర్ అభ్యంతరం చెబుతున్న వైనం సుదీర్ఘమైన సందేశంలో కనిపించింది.
మీతో పని చేసిన అనుభవం ఎంత బాధ పెట్టినా మీ అనుభవం గురించి కొంత నేర్చుకున్నాను కాబట్టే గౌరవం చూపిస్తున్నానని, లేదూ ఇక్కడితో వదిలేయకుండా కెలుకుతూనే ఉంటానంటే మాత్రం ఏ టైం అయినా సరే వెయిట్ చేస్తుంటానని పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ స్టైల్ లో ముగింపు ఇచ్చారు. నిజానికిది ఛోటా ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూనా లేక పాతదా అనే క్లారిటీ పూర్తిగా లేకపోయినా వైరల్ అయిపోయి మ్యాటర్ దర్శకుడి దాకా వెళ్లడంతో రచ్చ ఆన్ లైన్ కు వచ్చింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదంటున్న హరీష్ శంకర్ మాటలకు తిరిగి చోటా కె నాయుడు స్పందిస్తారో లేదో చూడాలి.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…