ఏదో యధాలాపంగా లేదా ముఖాముఖీలో అవతలి వ్యక్తి అడిగాడని ఏదేదో మాట్లాడేస్తే సోషల్ మీడియా వ్యవహారాలు ఒక్కోసారి చాలా దూరం వెళ్లిపోతాయి. తాజాగా జరిగిన ఉదంతమే మంచి ఉదాహరణ. ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె నాయుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామయ్య వస్తావయ్యా చేస్తున్న టైంలో దర్శకుడు హరీష్ శంకర్ వల్ల ఇబ్బంది పడ్డానని, చెప్పిన మాట వినకుండా అలా ఇలా అని సతాయిస్తే సరేలేనని ఆయన చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోయానని చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకునే తత్వం హరీష్ లో లేదనే కోణంలో ఈ మాటలు బయటికి వెళ్లాయి.
దీంతో ఎక్స్ వేదికగా హరీష్ శంకర్ స్వయంగా స్పందించాడు. ఛోటాను ఉద్దేశించి మెసేజ్ పెడుతూ వందకు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చిన తాను ఏనాడూ మీ గురించి నెగటివ్ గా మాట్లాడలేదని, రామయ్య వస్తావయ్యా టైంలో వేరే కెమెరామెన్ ని పెట్టుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు దిల్ రాజు గారి మాట మీద, గబ్బర్ సింగ్ తర్వాత గర్వం వచ్చిందనుకుంటారనే ఉద్దేశంతో ఇబ్బంది పడుతూనే మీతో షూట్ చేసుకున్నానని వివరించాడు. యాంకర్ అడగకపోయినా తన గురించి అవమానంగా మాట్లాడ్డం పట్ల హరీష్ శంకర్ అభ్యంతరం చెబుతున్న వైనం సుదీర్ఘమైన సందేశంలో కనిపించింది.
మీతో పని చేసిన అనుభవం ఎంత బాధ పెట్టినా మీ అనుభవం గురించి కొంత నేర్చుకున్నాను కాబట్టే గౌరవం చూపిస్తున్నానని, లేదూ ఇక్కడితో వదిలేయకుండా కెలుకుతూనే ఉంటానంటే మాత్రం ఏ టైం అయినా సరే వెయిట్ చేస్తుంటానని పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ స్టైల్ లో ముగింపు ఇచ్చారు. నిజానికిది ఛోటా ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూనా లేక పాతదా అనే క్లారిటీ పూర్తిగా లేకపోయినా వైరల్ అయిపోయి మ్యాటర్ దర్శకుడి దాకా వెళ్లడంతో రచ్చ ఆన్ లైన్ కు వచ్చింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదంటున్న హరీష్ శంకర్ మాటలకు తిరిగి చోటా కె నాయుడు స్పందిస్తారో లేదో చూడాలి.
This post was last modified on April 20, 2024 6:30 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…