బాక్సాఫీస్ చాలా నీరసంగా ఉంది. థియేటర్లకు కనీసం కరెంటు బిల్లులు కట్టేంత జనం రాక ఎగ్జిబిటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ ,లాంటివి కొంత ఊరట కలిగిస్తున్నా అవి కూడా ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్నాయి. ఓటిటి డేట్లు వచ్చేయడంతో ఆటోమేటిక్ గా ఆడియన్స్ ఆసక్తి తగ్గిపోతుంది. మొన్న శుక్రవారం రిలీజైన వాటిలో ఏదీ కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఎగ్జిబిటర్లు, మూవీ లవర్స్ అందరి దృష్టి రాబోయే ఫ్రైడే మీద ఉంది. ఈ నేపథ్యంలో విశాల్, రోహిత్ లకు బంగారం లాంటి అవకాశం దొరికిందని చెప్పాలి.
గురువారమే నారా రోహిత్ ప్రతినిధి 2 వస్తోంది. సమకాలీన రాజకీయాల మీద వేసిన సీరియస్ సెటైర్ కావడంతో ట్రైలర్ చూశాక అంచనాలు మొదలయ్యాయి. ప్రెజెంటేషన్ బాగుంటే ఖచ్చితంగా వసూళ్లు బాగుంటాయి. ఎన్నికల వాతావరణం వేడిగా ఉన్న తరుణంలో దీనికొచ్చే టాక్ కనక పాజిటివ్ గా ఉంటే పార్టీల నుంచి కూడా మద్దతు ఉంటుంది. మరుసటి రోజు విశాల్ రత్నంతో వస్తున్నాడు. ఊర మాస్ అరుపుల దర్శకుడు హరి తీసిన సినిమా ఇది. ట్రైలర్ మీద ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కనిపించలేదు కానీ హీరో దర్శకుడు మాత్రం డైరెక్ట్ గా తెరమీద సర్ప్రైజ్ చేస్తామని హామీ ఇస్తున్నారు.
స్తబ్దుగా ఉన్న థియేటర్ల వాతావరణాన్ని సందడి కలిగించేలా ఈ రెండు వర్కవుట్ అయితే మళ్ళీ పబ్లిక్ ని హాళ్లలో చూడొచ్చు. ఆపై మే 3న ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి లేకపోవడం ప్రతినిధి 2, రత్నంలకు కలిసి వచ్చే అంశం. ఇంత దారుణమైన డ్రై పీరియడ్ ని గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్స్ టాక్. రోహిత్, విశాల్ లు కనక ఈ బంగారం లాంటి ఛాన్స్ ని వాడుకుంటే బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ ఏకంగా హిట్టు కొట్టేయొచ్చు. మే 13 ఏపీ ఎలక్షన్ల దాకా జనాల మూడ్ సినిమాల వైపు పెద్దగా ఉండదనే అభిప్రాయం తప్పని ఋజువు చేయాలంటే ఈ రెండూ చాలా బాగున్నాయనినిపించుకుంటే చాలు.
This post was last modified on April 20, 2024 6:25 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…