ఆరేళ్ళ క్రితం 2018లో వచ్చిన ఆరెక్స్ 100 సెన్సేషనల్ హిట్ తో ప్రేక్షకుల దృష్టిలో పడ్డ హీరో కార్తికేయకు ఆ తర్వాత ఏళ్ళ తరబడి సక్సెస్ దూరంగా నిలిచిపోయింది. చేసినవన్నీ దాదాపు డిజాస్టర్లే, హిప్పీ, గుణ 369, చావు కబురు చల్లగా, 90 ఎంఎల్, రాజా విక్రమార్క ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టాయి. విలన్ గా ట్రై చేసిన వాటిలో నాని గ్యాంగ్ లీడర్ నిరాశ పరచగా అజిత్ వలిమై కమర్షియల్ గా సక్సెస్ అందుకున్నా తమిళంలోనూ పెద్దగా ఆఫర్లేం రాలేదు. గత ఏడాది బెదురులంక 2012 ఊరట కలిగించింది. మరీ గొప్పగా ఆడకపోయినా వసూళ్ల పరంగా హిట్టు స్టాంపుతోనే బయట పడింది.
ఇప్పుడు కార్తికేయ ఆశలన్నీ భజే వాయు వేగం మీదే ఉన్నాయి. యువి కాన్సెప్ట్స్ సంస్థ నిర్మాణంలో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందించారు. టీజర్ కట్ ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పుడు తండ్రికిచ్చిన మాట కోసం పెద్దయ్యాక ఓ యువకుడు డ్రగ్స్ మాఫియాని ఎదురుకుని ప్రాణాలకు తెగించి చేసే సాహసం చుట్టూ స్టోరీని అల్లుకున్నారు. కథని పూర్తిగా ఓపెన్ చేయకపోయినా టైటిల్, టీజర్ రెండింటిని బట్టి ఒక అంచనాకు రావొచ్చు. సోలో హీరోగా ఇంత సీరియస్ యాక్షన్ జానర్ కార్తికేయ ట్రై చేయడం ఇదే మొదటిసారని చెప్పాలి.
విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు కానీ మే 3 లేదా ఆపై రెండు లేదా మూడో వారం ఆప్షన్లుగా చూస్తున్నారు. ఈ మధ్య యువి తీస్తున్న మీడియం బడ్జెట్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ గామి ఈజీగా గట్టెక్కగా, శ్రీవిష్ణు ఓం భీం బుష్ సైతం సేఫ్ గేమ్ ఆడేసింది. అందుకే భజే వాయు వేగం కూడా అదే తరహాలో వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. ఏదో ఒకటి విభిన్నంగా చేస్తే తప్ప ప్రేక్షకుల ఆదరణ దొరకడం కష్టమైన తరుణంలో కార్తికేయ చేయాల్సింది ఇలాంటి ప్రయత్నాలే. ఐశ్యర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న భజే వాయు వేగంకు రదన్ పాటలు, కపిల్ బీజీఎమ్ సమకూరుస్తున్నారు.
This post was last modified on April 20, 2024 4:23 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…