నిన్న విడుదలైన చిన్న సినిమాలను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఏవో ఒకటి కొత్తవి వస్తే ప్రతి శుక్రవారం థియేటర్ కు వెళ్లి చూడాలనుకునే బ్యాచ్ ఎంతో కొంత ఉండక పోరు. పారిజాత పర్వం తర్వాత కొంత జనాల దృష్టి పడేలా టీమ్ ప్రమోషన్ చేసిన మూవీ టెనెంట్. ఇంగ్లీష్ పేరు పెట్టి ఏదో వెరైటీ అనుకున్నారు కానీ నిజానికి పబ్లిక్ కి రీచ్ కాకపోవడంలో ఇది కూడా ఒకరకంగా దోహదం చేసిందని చెప్పాలి. మా ఊరి పొలిమేర 2 సూపర్ హిట్ తర్వాత సత్యం రాజేష్ కొచ్చిన ఇమేజ్ దృష్ట్యా అతనే ప్రధాన పాత్ర పోషించిన టెనెంట్ కు మంచి రెస్పాన్స్ ఉంటుందని నిర్మాతలు భావించారు.
సత్యం రాజేష్ సైతం కనెక్ట్ అవుతుందేమోనని ఎదురు చూశాడు. తీరా చూస్తే కంటెంట్ ప్లస్ రెస్పాన్స్ పరంగా రెండింట్లోనూ టెనెంట్ నిరాశపరిచేలానే ఉంది. కథేంటో చూద్దాం. గౌతమ్(సత్యం రాజేష్), సంధ్య(మేఘ చౌదరి) దంపతులు. ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని సంతోషంగా ఉంటారు. అమెరికా వెళ్లే ప్లాన్ లో ఉండగా అనూహ్యంగా సంధ్య హత్యకు గురవుతుంది. అదే సమయంలో ఓ యువకుడు (భరత్ కాంత్) సూసైడ్ చేసుకుంటాడు. లేడీ ఆఫీసర్(ఎస్తర్)విచారణకు వస్తుంది. హత్యా నేరం మీద పడ్డ గౌతమ్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనేది అసలు సస్పెన్స్ పాయింట్.
కేవలం 1 గంట 36 నిమిషాల నిడివి ఉన్న టెనెంట్ చాలా తక్కువ సమయంలోనూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేక ఆసక్తికరంగా సాగదు. భార్య హత్య చుట్టూ గతంలో బోలెడు సినిమాలు వచ్చినప్పటికి ఇందులో దర్శకుడు యుగంధర్ తీసుకున్న బ్యాక్ డ్రాప్ కొంచెం కొత్తగా, మెసేజ్ టచ్ తో ఆలోచించేదిగా ఉన్నప్పటికీ సరైన రీతిలో కథా కథనాలు లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా కథ ఎటు పోతుందో అర్థం కాదు. బలం లేని సన్నివేశాల వల్ల థ్రిల్ ఫ్యాక్టర్ పూర్తిగా దెబ్బ తింది. లెన్త్ పరంగా చూస్తే ఓటిటి కోసం తీసింది థియేటర్లకు వదిలినట్టు ఉన్నారు . పుణ్యం పురుషార్థం రెండూ దక్కలేదు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…