నిన్న విడుదలైన చిన్న సినిమాలను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఏవో ఒకటి కొత్తవి వస్తే ప్రతి శుక్రవారం థియేటర్ కు వెళ్లి చూడాలనుకునే బ్యాచ్ ఎంతో కొంత ఉండక పోరు. పారిజాత పర్వం తర్వాత కొంత జనాల దృష్టి పడేలా టీమ్ ప్రమోషన్ చేసిన మూవీ టెనెంట్. ఇంగ్లీష్ పేరు పెట్టి ఏదో వెరైటీ అనుకున్నారు కానీ నిజానికి పబ్లిక్ కి రీచ్ కాకపోవడంలో ఇది కూడా ఒకరకంగా దోహదం చేసిందని చెప్పాలి. మా ఊరి పొలిమేర 2 సూపర్ హిట్ తర్వాత సత్యం రాజేష్ కొచ్చిన ఇమేజ్ దృష్ట్యా అతనే ప్రధాన పాత్ర పోషించిన టెనెంట్ కు మంచి రెస్పాన్స్ ఉంటుందని నిర్మాతలు భావించారు.
సత్యం రాజేష్ సైతం కనెక్ట్ అవుతుందేమోనని ఎదురు చూశాడు. తీరా చూస్తే కంటెంట్ ప్లస్ రెస్పాన్స్ పరంగా రెండింట్లోనూ టెనెంట్ నిరాశపరిచేలానే ఉంది. కథేంటో చూద్దాం. గౌతమ్(సత్యం రాజేష్), సంధ్య(మేఘ చౌదరి) దంపతులు. ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకుని సంతోషంగా ఉంటారు. అమెరికా వెళ్లే ప్లాన్ లో ఉండగా అనూహ్యంగా సంధ్య హత్యకు గురవుతుంది. అదే సమయంలో ఓ యువకుడు (భరత్ కాంత్) సూసైడ్ చేసుకుంటాడు. లేడీ ఆఫీసర్(ఎస్తర్)విచారణకు వస్తుంది. హత్యా నేరం మీద పడ్డ గౌతమ్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనేది అసలు సస్పెన్స్ పాయింట్.
కేవలం 1 గంట 36 నిమిషాల నిడివి ఉన్న టెనెంట్ చాలా తక్కువ సమయంలోనూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేక ఆసక్తికరంగా సాగదు. భార్య హత్య చుట్టూ గతంలో బోలెడు సినిమాలు వచ్చినప్పటికి ఇందులో దర్శకుడు యుగంధర్ తీసుకున్న బ్యాక్ డ్రాప్ కొంచెం కొత్తగా, మెసేజ్ టచ్ తో ఆలోచించేదిగా ఉన్నప్పటికీ సరైన రీతిలో కథా కథనాలు లేకపోవడంతో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా కథ ఎటు పోతుందో అర్థం కాదు. బలం లేని సన్నివేశాల వల్ల థ్రిల్ ఫ్యాక్టర్ పూర్తిగా దెబ్బ తింది. లెన్త్ పరంగా చూస్తే ఓటిటి కోసం తీసింది థియేటర్లకు వదిలినట్టు ఉన్నారు . పుణ్యం పురుషార్థం రెండూ దక్కలేదు.
This post was last modified on April 20, 2024 3:27 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…