వెయ్యికి పైగా సినిమాలతో కోట్లాది అభిమానులను సంపాదించుకుని 90 దశకం నాటి పాటలతో కూడా ఇప్పటి జనరేషన్ ను మెప్పిస్తున్న మాస్ట్రో ఇళయరాజాకు తమిళంలోనే కాదు తెలుగులోనూ లక్షలాది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్బి బాలసుబ్రమణ్యం బ్రతికున్న సమయంలో తనకు రాయల్టీ చెల్లించే విషయంలో రాజా విభేదాలు తెచ్చుకుని కొంత కాలం ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండటం చూశాం. తర్వాత ఈ ఇష్యూ సద్దుమణిగింది కానీ ముందుస్థాయిలో వాళ్ళ మధ్య అనుబంధం కనిపించలేదు. తర్వాత బాలు కన్నుమూశారు. చెన్నై ప్రసాద్ స్టూడియోస్ లో రూముకు సంబంధించిన ఇంకో వివాదం రాజాని ఇబ్బంది పెట్టింది.
తాజాగా మరోసారి ఇసైజ్ఞాని వార్తల్లోకి ఎక్కారు. తన సినిమా పాటల హక్కులను సొంతం చేసుకుని క్యాసెట్లు, సిడిలు, ఆన్ లైన్ జ్యుక్ బాక్సుల ద్వారా వ్యాపారం చేసిన ఎకో తదితర సంస్థలకు గడువు తీరిందని, దీంతో వాటికి సంబంధించిన కాపీ రైట్స్ తనకే చెందేలా తీర్పు ఇవ్వాలని ఇళయరాజా కోర్టుని ఆశ్రయించారు. కౌంటర్ వేసిన కంపెనీ ప్రతినిధులు తమకు అనుకూలంగా జడ్జ్ మెంట్ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. కాపీ హక్కులు ఇళయరాజాకు చెందవని, సదరు సంస్థలు ఆయా ఆల్బమ్స్ ని వాడుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది. కథ ఇక్కడితో అయిపోలేదు.
రాజా తరఫు లాయర్ కోర్టులో వాదిస్తూ తన క్లయింట్ అందరికంటే గొప్పవాడనే రీతిలో చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన న్యాయ మూర్తులు సంగీత త్రిమూర్తులుగా చెప్పుకునే ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజర్, శ్యామశాస్త్రి కంటే ఇళయరాజా గొప్పవారు కాదని ఉటంకిస్తూ తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. కాపీ రైట్స్ విషయంలో రాజా గెలిచే అవకాశాలు తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ లో ఉన్నప్పుడు కాంట్రావర్సిల జోలికి వెళ్లని మాస్ట్రో ఇంత లేటు వయసులో పాటల హక్కుల కోసం పోరాటం చేయడం విశేషమే కానీ ఫలితమే దక్కడం లేదు.
This post was last modified on April 20, 2024 12:03 pm
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…