ప్రస్తుతం టాలీవుడ్ టాప్ బేనర్లలో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్కు పెద్ద బడ్జెట్ సినిమాల కంటే చిన్నవే బాగా కలిసొస్తున్నాయి. గత ఏడాది 2022లో డీజే టిల్లు మూవీతో ఘనవిజయాన్నందుకున్న ఆ సంస్థకు గత ఏడాది మ్యాడ్ మూవీ మంచి లాభాలు అందించింది. ఇటీవలే డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్తో ఇంకో పెద్ద సక్సెస్ను ఖాతాలో వేసుకుంది సితార సంస్థ.
బహుశా ఆ సంస్థ చరిత్రలోనే ఈ సినిమా అందించినంత లాభాలు ఇంకే సినిమా ఇచ్చి ఉండకపోతే ఆశ్చర్యం లేదు. టిల్లు స్క్వేర్ తర్వాత మ్యాడ్ మూవీకి కూడా సితార బేనర్లో సీక్వెల్ తెరకెక్కుతుండడం విశేషం. టైటిల్ విషయంలోనూ టిల్లు స్క్వేర్నే అనుసరిస్తూ.. మ్యాడ్ స్క్వేర్ అని పెట్టుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా చడీచప్పుడు లేకుండా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పుడీ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
టిల్లు స్క్వేర్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సమక్షంలో మ్యాడ్ స్క్వేర్ ప్రారంభోత్సవం జరిగింది. మ్యాడ్ మూవీలో నటించిన ముగ్గురు హీరోలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్లతో పాటు విష్ణు ఓయ్ ఈ చిత్రంలోనూ అవే పాత్రల్లో కొనసాగబోతున్నారు. వీళ్లు సినిమా ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. మరి హీరోయిన్ల మాటేంటో చూడాలి. మ్యాడ్ను మించిన వినోదం ఈ చిత్రంలో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
మ్యాడ్ మూవీలో హీరోలు ముగ్గురూ ఇంజినీరింగ్ పూర్తి చేయడంతోకథ ముగుస్తుంది. అలాంటపుడు మ్యాడ్ స్క్వేర్లో కథ కాలేజీ నుంచి హీరోల ఉద్యోగ జీవితం వైపు మళ్లే అవకాశముంది. ప్రాపర్ సీక్వెల్ లాగా తీయాలంటే అలాగే కథను ముందుకు తీసుకెళ్లాలి. అలా కాకుండా దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇంకేదైనా డిఫరెంటుగా ట్రై చేస్తాడేమో చూడాలి
This post was last modified on April 19, 2024 11:25 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…