బాలకృష్ణ దర్శకుడు బాబీ కలయికలో రూపొందుతున్న సినిమాకు ఎన్నికల కోసం బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెల పదమూడు వరకు హీరో పాల్గొనే అవకాశం లేకపోవడంతో టీమ్ పూర్తయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు తదుపరి షెడ్యూల్స్ కి సంబంధించిన పనులను ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉంది. కొంత లేట్ అయినా పర్వాలేదు అభిమానులు 2025 సంక్రాంతి బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. పండగ సెంటిమెంట్ ని మరోసారి వాడుకుంటూ బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని ఆశ పడుతున్నారు. అయితే బాలయ్య 109 టార్గెట్ సంక్రాంతి కావడం లేదు.
ఎందుకంటే ఎలక్షన్లు పూర్తవ్వగానే వీలైనంత వేగంగా షూట్ చేసేలా బాబీ రెడీ అవుతున్నాడు. గత ఏడాది భగవంత్ కేసరి తరహాలో దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో సితార ఎంటర్ టైన్మెంట్స్ టీమ్ ఉందని ఇన్ సైడ్ టాక్. మరో బలమైన కారణం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇదే సంస్థ నుంచి వచ్చే సంవత్సరం సంక్రాంతికి రవితేజ – భాను భోగవరపు కాంబో మూవీని ఆల్రెడీ లాక్ చేశారు. ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ రోజే రిలీజ్ గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అంటే బాలయ్యది అంత ఆలస్యం కాదనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే తేదీ ఎప్పుడనేది కొంత కాలం సస్పెన్సే.
ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా నెలకు రెండు మూడు క్రేజీ చిత్రాలు ఆల్రెడీ డేట్లను బ్లాక్ చేసుకుని ప్రకటనలు ఇచ్చాయి. మరికొన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని అనౌన్స్ మెంట్ కు రెడీ అవుతున్నాయి. ఓజి, దేవర, పుష్ప 2, భారతీయుడు 2, కంగువా, సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్ తదితరాలన్నీ క్యూ కట్టి ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటూనే బాలయ్య 109కి బెస్ట్ డేట్ పట్టాలి. ఒకవేళ అనూహ్యంగా ఏదైనా జరిగి జనవరికి కర్చీఫ్ వేసిన రవితేజ తప్పుకుంటే అప్పుడు బాలకృష్ణ చిరంజీవిల పోటీని మరోసారి చూడొచ్చు. కానీ ఆ క్లాష్ ఈసారి ఉండకపోవచ్చు.
This post was last modified on April 19, 2024 6:38 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…