Movie News

మిరాయ్ అనుకున్న పని చేసిందోయ్

హనుమాన్ తర్వాత తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్ టైటిల్ అనౌన్స్ మెంట్ నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 18 విడుదల చేయబోతున్నట్టు ఏకంగా సంవత్సరం ముందే ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ఎపిక్ ఫాంటసీకి ఈగల్ ఫేమ్ కార్తీక ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ కొంత భాగం ఆల్రెడీ పూర్తయిన సంగతి టీజర్ చూశాక అర్థమైపోయింది. చాలా క్వాలిటీ విజువల్స్ ని మంచి విఎఫెక్స్ జోడించి చూపించిన తీరు ఆశ్చర్యపరిచింది. అంత వేగంగా ఇలాంటి అవుట్ ఫుట్ అంటే సులభం కాదు.

ఏ ఉద్దేశంతో అయితే మిరాయ్ ని పరిచయం చేశారో ఆ కార్యం నెరవేరుతోంది. హనుమాన్ హీరోగా తేజ సజ్జకు నార్త్ లో బాగా గుర్తింపు వచ్చింది. తన నెక్స్ట్ మూవీకి గ్యాప్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాళ్ళు తనను మర్చిపోయే రిస్క్ ఉంది. ఇప్పుడు మిరాయ్ వల్ల దీని గురించిన చర్చ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ వర్గాల్లోనూ జరుగుతోంది. పెద్ద స్టార్ హీరోలకు మాత్రమే ఇంత బడ్జెట్ పెట్టే ఉత్తరాది పరిశ్రమకు, హీరో ఇమేజ్ కాకుండా కంటెంట్ మీద ఖర్చు పెట్టే టాలీవుడ్ ధోరణికి తేడా తెలుసుకుంటున్నారు. సబ్జెక్టులో సత్తా ఉంటే వందల కోట్లు వస్తాయని హనుమాన్, కాంతారలు నిరూపించాయి.

సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మిరాయ్ ప్రొడక్షన్ ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ అంచనాలు పెంచే దిశగా ప్లానింగ్ చేసుకుంటే రిలీజ్ నాటికి బిజినెస్ డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. హీరో ఎవరనే దానితో సంబంధం లేకుండా క్రేజీ రేట్లు పెట్టి బయ్యర్లు కొంటారు. ఇప్పటికైతే 2025 ఏప్రిల్ 18 ఎవరూ లాక్ చేసుకోలేదు. అసలు అంత దూరం ఆలోచించలేదు కూడా. పోనీ రాజా సాబ్ వస్తుందనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కూడా పీపుల్స్ మీడియా నిర్మాణమే కాబట్టి వేరే ఆప్షన్ అనుకునే ఉంటారు. ఏదైతేనేం మిరాయ్ అనుకున్న కార్యాన్ని నెరవేర్చేస్తోంది.

This post was last modified on April 19, 2024 6:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

23 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

2 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago