నటుడిగా గొప్ప పేరు, దాంతో పాటే సూపర్ స్టార్ ఇమేజ్ ఉణ్న వాళ్లు అరుదుగా ఉంటారు. విక్రమ్ ఈ కోవకే చెందుతాడు. సేతు, పితామగన్ (శివపుత్రుడు), సామి, అన్నియన్ (అపరిచితుడు) లాంటి బ్లాక్బస్టర్లతో ఒకప్పుడు సౌత్ ఇండియాలో అతడి పేరు మార్మోగిపోయింది. ఇక్కడి టాప్ స్టార్లకు అతణ్ని చూస్తే అసూయ పుట్టే పరిస్థితి. కానీ ఆ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన అతడి సినిమాలేవీ ఆశించిన విజయం సాధించలేకపోయాయి. గత రెండు దశాబ్దాలుగా సోలో హీరోగా విక్రమ్కు నిఖార్సయిన హిట్టే లేదు. అయినా అతడి నుంచి పెద్ద పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి.
కబాలి దర్శకుడు పా.రంజిత్తో విక్రమ్ ‘తంగలాన్’ అనే ఎపిక్ మూవీ చేస్తున్నాడు. కానీ దాని రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. పైగా అందులో విక్రమ్ అవతారం అదీ చూస్తే ఆ మూవీ కమర్షియల్గా ఆడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కానీ విక్రమ్ చేస్తున్న మరో సినిమా మాత్రం చాలా ప్రామిసింగ్గా, ఎగ్జైటింగ్గా కనిపిస్తోంది. సిద్దార్థ్తో ‘చిత్తా’ (తెలుగులో చిన్నా) అనే హిట్ మూవీ తీసిన అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేసిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తాజాగా విక్రమ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇంకో టీజర్ వదిలారు. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. విక్రమ్ ఈ చిత్రంలో కిరాణా కొట్టు నడిపే మధ్య తరగతి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇలాంటి పాత్రతో హీరోయిజం ఎలా పండించడం అనిపిస్తుంది కానీ.. టీజర్ చూస్తే మాత్రం హీరోయిజం వేరే లెవెల్లో ఉంటుందని అర్థమవుతోంది.
హీరో చేతిలో దెబ్బలు తిన్న ఒక గ్యాంగ్.. అతడి కిరాణా కొట్టు ముందు కాపు కాయడం.. వీళ్ల రాకను గుర్తించి హీరో కొట్టులో అక్కడక్కడా పెట్టిన మారణాయుధాల్ని రెడీ చేసుకోవడం.. ఓవైపు తన వ్యాపారం సాగిస్తూనే విలన్లకు ధమ్కీ ఇస్తూ ముగిసిన టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి. విక్రమ్కు చాన్నాళ్ల తర్వాత ఓ మాస్ హిట్ పడేలా ఉంది ప్రోమోలు చూస్తుంటే. ‘వీర ధీర సూరన్’ అనే టైటిల్తో రానున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండడం విశేషం.
This post was last modified on April 18, 2024 2:37 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…