జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ దేవర థియేట్రికల్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన బడా సంస్థలు నువ్వా నేనాని తలపడుతున్న తరుణంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీకి డీల్ దాదాపు ఓకే అయ్యిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 115 నుంచి 125 కోట్ల మధ్యలో ఏపీ తెలంగాణ కలిపి ఒక నెంబర్ దగ్గర లాక్ చేస్తారని, అగ్రిమెంట్ అవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందని సమాచారం. అప్పటిదాకా దీన్ని నిర్ధారణగా చెప్పలేం.
ఇక్కడ కొన్ని అంశాలు గమనిస్తే పైన చెప్పిన విషయానికి బలం చేకూరుతుంది. ఇటీవలే జరిగిన టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు తారక్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్ చూశాడు. మాములుగా అన్నయ్య కళ్యాణ్ రామ్ కు తప్ప బయట ఈవెంట్లకు అంత సుముఖత చూపని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా టిల్లుకు మాత్రమే ఎందుకు సానుకూలంగా ఉన్నాడంటే అప్పటికే దేవర డీల్ కు సంబంధించి తన ప్రయత్నాలను నాగవంశీ బయటపెట్టడం వల్లేనని టాక్. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అదే వేదిక మీద 2024 దేవర నామ సంవత్సరమని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఇవన్నీ ఒకదానికి మరొకటి ముడిపెట్టుకుని చూస్తే దేవర సితార చేతికి రావడంలో ఆశ్చర్యం లేదు. ఇంకా అయిదు నెలల సమయం ఉన్నప్పటికీ నిర్మాతలు బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. చివరి నిమిషం దాకా హడావిడి పడకుండా ముందే పూర్తి చేసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్విసి, మైత్రి లాగా పంపిణి రంగంలో పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉన్న సితార సంస్థకు నిజంగా దేవర చిక్కితే పెద్ద ప్రమోషన్ వచ్చినట్టే. ఆపై మెల్లగా ఇతర ప్యాన్ ఇండియా సినిమాలను టార్గెట్ చేసుకుని వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
This post was last modified on April 17, 2024 10:53 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…