టాలీవుడ్లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. కథానాయికగా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో క్యూట్ లుక్స్తో కట్టిపడేసిన ఈ ఢిల్లీ భామ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే.. ఇలా మిడ్ రేంజ్ సినిమాలతో మంచి ఊపు మీదే కనిపించింది. ఇదే ఊపులో తన కెరీర్ ఇంకో లెవెల్కు వెళ్తుందనుకుంటే.. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ.. ఇలా వరుసగా డిజాస్టర్లు పడడంతో రాశి కెరీర్ గాడి తప్పింది.
థ్యాంక్యూ తర్వాత ఏడాది పాటు తెలుగులో రాశికి ఛాన్సులే లేవు. ఆ టైంలోనే ఆమె బాలీవుడ్, కోలీవుడ్ మీద దృష్టిపెట్టింది. నెమ్మదిగా తెలుగు చిత్రాలకు దూరం కావడంతో ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ కొంచెం గ్యాప్ తర్వాత రాశి మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది.
ఆల్రెడీ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది రాశి ఖన్నా. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. టిల్ల స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనికి మంచి హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాతో రీఎంట్రీ అంటే రాశికి ప్లస్సే. ఈ సినిమా చేస్తూనే ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది రాశి.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘భీష్మ’ తర్వాత రాబోతున్న ‘రాబిన్ హుడ్’లో తాజాగా ఛాన్స్ అందుకుందట రాశి. ఈ చిత్రానికి ముందు రష్మిక మందన్నాను కథానాయికగా అనుకున్నారు. కానీ తర్వాత తన స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఈ చిత్రంలో ఇంకో ప్రత్యేకమైన పాత్రలో రాశి నటిస్తోందన్నది తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలు వర్కవుట్ అయితే రాశి మళ్లీ టాలీవుడ్లో బిజీ అవ్వడానికి ఛాన్సుంది.
This post was last modified on April 16, 2024 2:43 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…