టాలీవుడ్లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. కథానాయికగా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో క్యూట్ లుక్స్తో కట్టిపడేసిన ఈ ఢిల్లీ భామ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే.. ఇలా మిడ్ రేంజ్ సినిమాలతో మంచి ఊపు మీదే కనిపించింది. ఇదే ఊపులో తన కెరీర్ ఇంకో లెవెల్కు వెళ్తుందనుకుంటే.. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ.. ఇలా వరుసగా డిజాస్టర్లు పడడంతో రాశి కెరీర్ గాడి తప్పింది.
థ్యాంక్యూ తర్వాత ఏడాది పాటు తెలుగులో రాశికి ఛాన్సులే లేవు. ఆ టైంలోనే ఆమె బాలీవుడ్, కోలీవుడ్ మీద దృష్టిపెట్టింది. నెమ్మదిగా తెలుగు చిత్రాలకు దూరం కావడంతో ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ కొంచెం గ్యాప్ తర్వాత రాశి మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది.
ఆల్రెడీ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది రాశి ఖన్నా. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. టిల్ల స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనికి మంచి హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాతో రీఎంట్రీ అంటే రాశికి ప్లస్సే. ఈ సినిమా చేస్తూనే ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది రాశి.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘భీష్మ’ తర్వాత రాబోతున్న ‘రాబిన్ హుడ్’లో తాజాగా ఛాన్స్ అందుకుందట రాశి. ఈ చిత్రానికి ముందు రష్మిక మందన్నాను కథానాయికగా అనుకున్నారు. కానీ తర్వాత తన స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఈ చిత్రంలో ఇంకో ప్రత్యేకమైన పాత్రలో రాశి నటిస్తోందన్నది తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలు వర్కవుట్ అయితే రాశి మళ్లీ టాలీవుడ్లో బిజీ అవ్వడానికి ఛాన్సుంది.
This post was last modified on April 16, 2024 2:43 pm
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…