టాలీవుడ్లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. కథానాయికగా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో క్యూట్ లుక్స్తో కట్టిపడేసిన ఈ ఢిల్లీ భామ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే.. ఇలా మిడ్ రేంజ్ సినిమాలతో మంచి ఊపు మీదే కనిపించింది. ఇదే ఊపులో తన కెరీర్ ఇంకో లెవెల్కు వెళ్తుందనుకుంటే.. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ.. ఇలా వరుసగా డిజాస్టర్లు పడడంతో రాశి కెరీర్ గాడి తప్పింది.
థ్యాంక్యూ తర్వాత ఏడాది పాటు తెలుగులో రాశికి ఛాన్సులే లేవు. ఆ టైంలోనే ఆమె బాలీవుడ్, కోలీవుడ్ మీద దృష్టిపెట్టింది. నెమ్మదిగా తెలుగు చిత్రాలకు దూరం కావడంతో ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ కొంచెం గ్యాప్ తర్వాత రాశి మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది.
ఆల్రెడీ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది రాశి ఖన్నా. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. టిల్ల స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనికి మంచి హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాతో రీఎంట్రీ అంటే రాశికి ప్లస్సే. ఈ సినిమా చేస్తూనే ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది రాశి.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘భీష్మ’ తర్వాత రాబోతున్న ‘రాబిన్ హుడ్’లో తాజాగా ఛాన్స్ అందుకుందట రాశి. ఈ చిత్రానికి ముందు రష్మిక మందన్నాను కథానాయికగా అనుకున్నారు. కానీ తర్వాత తన స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఈ చిత్రంలో ఇంకో ప్రత్యేకమైన పాత్రలో రాశి నటిస్తోందన్నది తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలు వర్కవుట్ అయితే రాశి మళ్లీ టాలీవుడ్లో బిజీ అవ్వడానికి ఛాన్సుంది.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…