టాలీవుడ్లో ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. కథానాయికగా తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో క్యూట్ లుక్స్తో కట్టిపడేసిన ఈ ఢిల్లీ భామ.. ఆ తర్వాత బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండగే.. ఇలా మిడ్ రేంజ్ సినిమాలతో మంచి ఊపు మీదే కనిపించింది. ఇదే ఊపులో తన కెరీర్ ఇంకో లెవెల్కు వెళ్తుందనుకుంటే.. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ.. ఇలా వరుసగా డిజాస్టర్లు పడడంతో రాశి కెరీర్ గాడి తప్పింది.
థ్యాంక్యూ తర్వాత ఏడాది పాటు తెలుగులో రాశికి ఛాన్సులే లేవు. ఆ టైంలోనే ఆమె బాలీవుడ్, కోలీవుడ్ మీద దృష్టిపెట్టింది. నెమ్మదిగా తెలుగు చిత్రాలకు దూరం కావడంతో ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ కొంచెం గ్యాప్ తర్వాత రాశి మళ్లీ తెలుగులో బిజీ అవుతోంది.
ఆల్రెడీ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో ఓ కథానాయికగా నటిస్తోంది రాశి ఖన్నా. నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. టిల్ల స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనికి మంచి హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి సినిమాతో రీఎంట్రీ అంటే రాశికి ప్లస్సే. ఈ సినిమా చేస్తూనే ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది రాశి.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘భీష్మ’ తర్వాత రాబోతున్న ‘రాబిన్ హుడ్’లో తాజాగా ఛాన్స్ అందుకుందట రాశి. ఈ చిత్రానికి ముందు రష్మిక మందన్నాను కథానాయికగా అనుకున్నారు. కానీ తర్వాత తన స్థానంలోకి శ్రీ లీల వచ్చింది. ఈ చిత్రంలో ఇంకో ప్రత్యేకమైన పాత్రలో రాశి నటిస్తోందన్నది తాజా సమాచారం. ఈ రెండు చిత్రాలు వర్కవుట్ అయితే రాశి మళ్లీ టాలీవుడ్లో బిజీ అవ్వడానికి ఛాన్సుంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…