హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువనే సంగతి పక్కనపెడితే విశాల్ కు తెలుగులో మంచి మాస్ ఇమేజ్ ఉంది. పందెం కోడితో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కొన్ని వరస సినిమాలు కమర్షియల్ గా సాధించిన విజయాలు ఇమేజ్ ని పెంచాయి. అటుపై కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల పడ్డ డిజాస్టర్లు డబ్బింగ్ మార్కెట్ ని దెబ్బ కొట్టాయి. గోపీచంద్ లాగా సరైన కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న విశాల్ త్వరలో రత్నంగా రాబోతున్నాడు. సామీ, సింగం సిరీస్ తో బాగా పాపులరైన హరి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు. ఏప్రిల్ 26 థియేటర్లలో అడుగు పెడుతున్నాడు.
ట్రైలర్ చూస్తే విశాల్ ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మళ్ళీ పాత స్కూలుకు వెళ్ళిపోయాడు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, వాటి పెద్దల మధ్య ఉండే పగలు, అవతలి వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం ఊచకోత కోస్తూ ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా రత్నం ఇలా మొత్తం సెటప్ ఒక ఫార్ములా ప్రకారం జరిగిపోయింది. బద్దశత్రువులుగా సముతిరఖని, మురళీశర్మలు కనిపించగా హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటించింది. విజువల్స్ గట్రా చూస్తుంటే దం బిర్యానీ లాంటి మహేష్ బాబు ఒక్కడుని అరవ సాంబార్ కలిపి వడ్డించినట్టు ఉంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం ఎందుకో డిఫరెంట్ గా అనిపించలేదు. సీన్లను ఎలివేట్ చేసిన ఫీలింగ్ కలగలేదు. విశాల్ పాత్ర మాస్ టచ్ తో గతంలో చూసినట్టే ఉంది. హరి మాత్రం సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలను మెప్పిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో పాల్గొనేందుకు విశాల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే రోజు తమన్నా – రాశిఖన్నాల బాక్ రిలీజవుతోంది. ముందురోజు నారా రోహిత్ ప్రతినిధి 2 ఉంది. సో ఎక్కువ పోటీలేని టైంలో ఇలాంటి మాస్ బొమ్మతో ఈసారైనా విశాల్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…