టాలెంట్ ఎంతున్నా సక్సెస్ అందుకోవడంలో వెనుకబడ్డ నారా రోహిత్ హీరోగా రూపొందిన ప్రతినిధి 2 ఇంకో పది రోజుల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిల్లు స్క్వేర్ తర్వాత బాక్సాఫీసుకి కిక్ ఇచ్చిన సినిమా మరొకటి రాకపోవడంతో థియేటర్ల ఫీడింగ్ చాలా కష్టంగా మారింది. మంజుమ్మల్ బాయ్స్ మినహాయించి ది ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. లవ్ గురు, డియర్ తో సహా వరసగా రెండు వారాలు ట్రేడ్ ని నిరాశలో ముంచెత్తాయి. ఈ శుక్రవారం సైతం చెప్పుకోదగ్గ క్రేజీ రిలీజు ఏదీ లేదు.
మందు ప్రకటించిన ప్రకారమైతే ఏప్రిల్ 25 దిల్ రాజు సమర్పణలో లవ్ మీ ఇఫ్ యు డేర్ రావాల్సింది. కానీ ప్రమోషన్లకు టైం లేకపోవడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడిందని సమాచారం. సో దానికోసం ముందస్తుగా లాక్ చేసుకోవాలనుకున్న థియేటర్లు ఖాళీ అవుతాయి. వాటిని ప్రతినిధి 2 కోసం వాడుకోవచ్చు. మరుసటి రోజు విశాల్ డబ్బింగ్ మూవీ రత్నంతో పాటు తమన్నా, రాశిఖన్నాల బాక్ ఉన్నాయి. కమర్షియల్ గా ఇవి మాస్ ని టార్గెట్ చేసుకున్నవే అయినా అనువాదాలు కాబట్టి ఫ్యామిలీ, న్యూట్రల్ ఆడియన్స్ ని రప్పించడం అంత సులభంగా ఉండదు.
ఇదంతా ప్రతినిధి 2కి సానుకూలంగా పనిచేసేదే. టీవీ5 మూర్తి మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద టీజర్ వచ్చాక అంచనాలు మొదలయ్యాయి. ఈ మధ్య వచ్చిన పొలిటికల్ అజెండా సినిమాల్లా కాకుండా వర్తమాన రాజకీయాలను స్పృశిస్తూనే సీరియస్ గా నెరేట్ చేసిన విధానం కనెక్ట్ అయ్యేలానే ఉంది. లుక్స్, ఫిజిక్ పరంగా కూడా నారా రోహిత్ మంచి మేకోవర్ చూపిస్తున్నాడు. కాకపోతే సెన్సార్ ఇబ్బందులు ఏవీ తలెత్తకపోతేనే ప్రతినిధి 2కి రూట్ క్లియర్ గా ఉంటుంది. రిలీజ్ డేట్ కి ఎన్నికలకు మధ్య కేవలం ఇరవై రోజుల గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
This post was last modified on April 15, 2024 11:51 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…