దేశంలో అత్యధికంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన రాష్ట్రం ఏది అంటే మరో మాట లేకుండా తమిళనాడు అని చెప్పేయొచ్చు. తెలుగు నాట కూడా చాలామంది సినిమా వాళ్లు రాజకీయారంగేట్రం చేశార కానీ.. తమిళనాడు స్థాయిలో మాత్రం కాదు. అక్కడ ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమా వాళ్లు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. తమిళనాడును అత్యధిక కాలం పాలించింది కూడా సినిమా వాళ్లే. త్వరలోనే విజయ్ సైతం రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు.
మరోవైపు తెలుగువాడైన తమిళ స్టార్ హీరో విశాల్ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తనకు ఆ ఆసక్తి ఉన్నట్లు చెబుతున్నాడు కానీ.. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చేది మాత్రం తేల్చట్లేదు. ఐతే ఎట్టకేలకు విశాల్ ఈ విషయంలో ఒక ప్రకటన చేశాడు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2024లో తాను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు. ఐతే ఆ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేగా పోటీ చేయడం కాదు.. రాజకీయ పార్టీనే పెట్టబోతున్నట్లు విశాల్ వెల్లడించడం విశేషం. ‘‘త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నా. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతులు లేవు. వాళ్లకు సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది నా ఉద్దేశం. అందుకే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా’’ అని విశాల్ ప్రకటించాడు.
మరి ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారా అని విశాల్ను అడిగితే.. అలాంటిదేమీ లేదని.. ముందు తనను తాను నిరూపించుకున్న తర్ావతే మిగతా విషయాలు, పొత్తు గురించి ఆలోచిస్తానని విశాల్ చెప్పాడు.
This post was last modified on April 15, 2024 8:36 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…