దేశంలో అత్యధికంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చిన రాష్ట్రం ఏది అంటే మరో మాట లేకుండా తమిళనాడు అని చెప్పేయొచ్చు. తెలుగు నాట కూడా చాలామంది సినిమా వాళ్లు రాజకీయారంగేట్రం చేశార కానీ.. తమిళనాడు స్థాయిలో మాత్రం కాదు. అక్కడ ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమా వాళ్లు రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. తమిళనాడును అత్యధిక కాలం పాలించింది కూడా సినిమా వాళ్లే. త్వరలోనే విజయ్ సైతం రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు.
మరోవైపు తెలుగువాడైన తమిళ స్టార్ హీరో విశాల్ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తనకు ఆ ఆసక్తి ఉన్నట్లు చెబుతున్నాడు కానీ.. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చేది మాత్రం తేల్చట్లేదు. ఐతే ఎట్టకేలకు విశాల్ ఈ విషయంలో ఒక ప్రకటన చేశాడు.
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరిగే 2024లో తాను రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు. ఐతే ఆ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేగా పోటీ చేయడం కాదు.. రాజకీయ పార్టీనే పెట్టబోతున్నట్లు విశాల్ వెల్లడించడం విశేషం. ‘‘త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నా. పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతులు లేవు. వాళ్లకు సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నది నా ఉద్దేశం. అందుకే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నా’’ అని విశాల్ ప్రకటించాడు.
మరి ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారా అని విశాల్ను అడిగితే.. అలాంటిదేమీ లేదని.. ముందు తనను తాను నిరూపించుకున్న తర్ావతే మిగతా విషయాలు, పొత్తు గురించి ఆలోచిస్తానని విశాల్ చెప్పాడు.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…