మాములుగా ఒక పెద్ద డిపార్ట్ మెంట్ స్టోర్ వెళ్లేందుకు కారణాల్లో ఒకటి ప్రత్యేక డిస్కౌంట్లు. మాములు కిరాణా షాపుల్లో రాయితీలు ఉండవు. డి మార్ట్ లాంటి బడా సంస్థల సక్సెస్ ఫార్ములా ఇదే. మెల్లగా తమ సినిమాలకు వచ్చేలా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం నిర్మాతలు కూడా ఈ టైపు స్పెషల్ స్కీములు తీసుకురాక తప్పడం లేదు. ముఖ్యంగా ఈ వారం రిలీజైన వాటిలో మూడింటికి ఇలాంటి ప్లాన్లు అమలు చేయడం ఆశ్చర్యం కలిగించేదే. విజయ్ ఆంటోనీ లవ్ గురుకి మలేషియా, కాశ్మీర్, ఊటీ ట్రిప్పుని లక్కీ డిప్ ద్వారా తీసి గెలిచిన ఆడియన్స్ ని ఆయా ఊళ్ళకు, దేశాలకు పంపబోతున్నారు.
మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తీశారని చెప్పుకున్న బడేమియా చోటేమియాకు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేశారు. నెగటివ్ టాక్ దెబ్బ ఆ రేంజ్ లో పడింది. అందరూ ఆహా అని మెచ్చుకున్న మైదాన్ పరిస్థితి మెరుగ్గా లేదు. విమర్శకులు మెచ్చుకున్నా థియేటర్లలో జనం లేరు. దీంతో ఇది సైతం ఒక టికెట్ కొంటె మరొకటి ఉచితం బాట పట్టక తప్పలేదు. దీని ప్రభావం రెండు సినిమాల మీద సానుకూలంగా ఉంది. ఆ మేరకు ఆదివారం బుకింగ్స్ లో పెరుగుదల ఉందని ట్రేడ్ రిపోర్ట్. ఒకవేళ ఈ ఆఫర్ ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని బయ్యర్స్ టాక్.
రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఉదృతంగా కానుంది. వన్ ప్లస్ వన్ ఇవ్వడం బాలీవుడ్ లో కొత్తేమి కాదు కానీ ఫారిన్ టూర్లు గిఫ్ట్ గా అనౌన్స్ చేయడం మాత్రం టాలీవుడ్ లో గత దశాబ్ద కాలంలో ఎవరూ చేసిన దాఖలాలు లేవు. ఇదీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించడం బజ్ లేని సినిమాలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఫ్రీ టికెట్లు, డిస్కౌంట్ల మీద స్నాక్స్, గుంపుగా వస్తే ప్రత్యేక రేట్లు ఇలా ఏవో ఒకటి చేస్తూ ఉంటే తద్వారా ఆక్యుపెన్సీలను పెంచుకోవచ్చు. ఇంత చేసినా పైన చెప్పిన సినిమాల కంటే టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ వసూళ్లే బాగున్నాయి.
This post was last modified on April 15, 2024 8:18 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…