మాములుగా ఒక పెద్ద డిపార్ట్ మెంట్ స్టోర్ వెళ్లేందుకు కారణాల్లో ఒకటి ప్రత్యేక డిస్కౌంట్లు. మాములు కిరాణా షాపుల్లో రాయితీలు ఉండవు. డి మార్ట్ లాంటి బడా సంస్థల సక్సెస్ ఫార్ములా ఇదే. మెల్లగా తమ సినిమాలకు వచ్చేలా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం నిర్మాతలు కూడా ఈ టైపు స్పెషల్ స్కీములు తీసుకురాక తప్పడం లేదు. ముఖ్యంగా ఈ వారం రిలీజైన వాటిలో మూడింటికి ఇలాంటి ప్లాన్లు అమలు చేయడం ఆశ్చర్యం కలిగించేదే. విజయ్ ఆంటోనీ లవ్ గురుకి మలేషియా, కాశ్మీర్, ఊటీ ట్రిప్పుని లక్కీ డిప్ ద్వారా తీసి గెలిచిన ఆడియన్స్ ని ఆయా ఊళ్ళకు, దేశాలకు పంపబోతున్నారు.
మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తీశారని చెప్పుకున్న బడేమియా చోటేమియాకు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేశారు. నెగటివ్ టాక్ దెబ్బ ఆ రేంజ్ లో పడింది. అందరూ ఆహా అని మెచ్చుకున్న మైదాన్ పరిస్థితి మెరుగ్గా లేదు. విమర్శకులు మెచ్చుకున్నా థియేటర్లలో జనం లేరు. దీంతో ఇది సైతం ఒక టికెట్ కొంటె మరొకటి ఉచితం బాట పట్టక తప్పలేదు. దీని ప్రభావం రెండు సినిమాల మీద సానుకూలంగా ఉంది. ఆ మేరకు ఆదివారం బుకింగ్స్ లో పెరుగుదల ఉందని ట్రేడ్ రిపోర్ట్. ఒకవేళ ఈ ఆఫర్ ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని బయ్యర్స్ టాక్.
రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత ఉదృతంగా కానుంది. వన్ ప్లస్ వన్ ఇవ్వడం బాలీవుడ్ లో కొత్తేమి కాదు కానీ ఫారిన్ టూర్లు గిఫ్ట్ గా అనౌన్స్ చేయడం మాత్రం టాలీవుడ్ లో గత దశాబ్ద కాలంలో ఎవరూ చేసిన దాఖలాలు లేవు. ఇదీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించడం బజ్ లేని సినిమాలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఫ్రీ టికెట్లు, డిస్కౌంట్ల మీద స్నాక్స్, గుంపుగా వస్తే ప్రత్యేక రేట్లు ఇలా ఏవో ఒకటి చేస్తూ ఉంటే తద్వారా ఆక్యుపెన్సీలను పెంచుకోవచ్చు. ఇంత చేసినా పైన చెప్పిన సినిమాల కంటే టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ వసూళ్లే బాగున్నాయి.
This post was last modified on April 15, 2024 8:18 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…