నిన్న కొత్త రిలీజులు ఎక్కువ ఉండటంతో ఒక రోజు ఆలస్యంగా తెలుగు థియేటర్లలో అడుగు పెట్టిన సినిమా డియర్. జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా రూపొందిన ఈ కపుల్ ఎమోషనల్ డ్రామాకు ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది ఇదే కాన్సెప్ట్ తో గుడ్ నైట్ అనే మూవీ మంచి విజయం సాధించింది. హాట్ స్టార్ లో వచ్చినపుడు చూసి మన ఆడియన్స్ కూడా పాజిటివ్ గా స్పందించారు. ఇంచుమించు అదే కథతో వచ్చిన డియర్ మీద టీమ్ గట్టి నమ్మకమే ప్రదర్శించింది. పోటీ ఎంత ఉన్నా సరైన సినిమా లేదని ఫీలవుతున్న ట్రేడ్ కి డియర్ ఊరటనిస్తుందా.
అర్జున్ (జివి ప్రకాష్ కుమార్) ది నిద్రపోయేటప్పుడు చిన్న శబ్దం వచ్చినా ఠక్కున మేలుకునే రకం. సైలెంట్ స్లీపరని పేరు. పెద్దలు చూసిన దీపిక(ఐశ్వర్య రాజేష్) ని పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రే తెలిసిన నిజమేమిటంటే ఆ అమ్మాయికి భయంకరమైన గురక పెట్టే అలవాటు ఉంటుంది. దీంతో వీళ్ళ కాపురంలో కలతలు మొదలవుతాయి. ఏకంగా అర్జున్ ఉద్యోగానికే ప్రమాదం తలెత్తుంది. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత జరిగేది అసలు కథ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ గురక ప్రహసనం చుట్టూ నడిపిన ఆనంద్ రవిచంద్రన్ సెకండాఫ్ లో ఎమోషన్లు లాకొచ్చాడు.
షార్ట్ ఫిలింకు సరిపోయే పాయింట్ ని తీసుకుని సినిమాగా మలచే క్రమంలో కథనాన్ని వినోదాత్మకంగా మలచలేకపోవడం డియర్ ని సాగదీసేలా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత జరిగే సన్నివేశాల్లో ఫ్యామిలీ డ్రామా డోస్ ఎక్కువైపోయి దీపికకన్నా ముందు మనకు నిద్రొస్తుంది. అర్జున్ తల్లిగా చేసిన రోహిణి, ఆమె అన్న కాళీ వెంకట్ ఎపిసోడ్ బాగానే కుదిరినా మెయిన్ ప్లాట్ కి అంతగా అతకని వ్యవహారంలా మారిపోయింది. హీరోనే కంపోజ్ చేసుకున్న పాటలు ఏ మాత్రం బాలేవు. సినిమా చూస్తూ థియేటర్ ఏసిలో నిద్రపోయే పనైతే మాత్రం డియర్ ఆ ఒక్క విషయంలో సక్సెస్ అయినట్టే.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…