‘జ్ఞాపకం’ అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత అతను ‘స్నేహగీతం’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఆ తర్వాత కూడా నటుడిగానే కొనసాగుతాడనుకుంటే.. ఆశ్చర్యకరంగా రైటింగ్ వైపు అడుగులు వేశాడు. ఆపై దర్శకుడూ అయిపోయాడు. ‘తొలి ప్రేమ’ అని తన తొలి చిత్రానికి పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ టైటిల్ పెట్టుకుంటే అతడి మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడ్డారు. కట్ చేస్తే ఈ ‘తొలి ప్రేమ’ కూడా యువ ప్రేక్షకుల మనసు దోచి ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాతో అంచనాలు పెంచిన వెంకీ అట్లూరి.. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దె చిత్రాలతో నిరాశపరిచాడు. తొలి సినిమా స్టయిల్లోనే ప్రథమార్ధంలో లోకల్గా హీరో హీరోయిన్ల గిల్లికజ్జాలతో ప్రేమకథను నడిపించి.. ద్వితీయార్ధంలో కథను ఫారిన్కు షిఫ్ట్ చేస్తే జనాలకు రొటీన్గా అనిపించింది.
దీంతో వెంకీ మీద నమ్మకం సడలింది. అతణ్ని వన్ ఫిలిం వండర్ అనేశారు. కానీ నాలుగో చిత్రంతో వెంకీ పూర్తిగా రూటు మార్చేశాడు. విలక్షణ చిత్రాలు చేసే ధనుష్ను ఒప్పించి ఒక సినిమా చేయడమే కాదు.. దాన్ని మంచి హిట్ కూడా చేయగలిగాడు. వీళ్ల కలయికలో వచ్చిన ‘సార్’ ఉదాత్తమైన కథాంశంతో, సామాజిక అంశాలతో హృదయాలను తాకుతూనే కమర్షియల్గా కూడా మెప్పించింది. వెంకీ తొలి మూడు సినిమాలు చూశాక అతడి నుంచి ఇలాంటి చిత్రాన్ని ఎవ్వరూ ఊహించలేదు. దీని తర్వాత వెంకీ ఎలాంటి సినిమా తీస్తాడా అని అందరూ ఎదురు చూశారు. ఈసారి ఇంకో కొత్త జానర్లో అడుగుపెట్టాడు వెంకీ.
క్రైమ్, ఫన్ ముడిపడ్డ కథతో తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ‘లక్కీ భాస్కర్’ను అతను తీర్చిదిద్దినట్లున్నారు. టీజర్ పూర్తిగా ప్రేక్షకులను వేరే లోకంలోకి తీసుకెళ్లింది. కాన్సెప్ట్, విజువల్స్ అన్నీ కొత్తగా అనిపించాయి. ధనుష్ లాగే దుల్కర్ లాంటి విలక్షణ నటుడిని ఒప్పించి సినిమా చేయడమే ఒక అచీవ్మెంట్. దుల్కర్ ఇమేజ్కు తగ్గట్లే ఇదో వైవిధ్యమైన సినిమాలా నిలిచేలా ఉంది. వెంకీ ఇలా సినిమా సినిమాకూ జానర్ మారుస్తూ, హిట్ కొడుతూ వెళ్తుంటే కొన్నేళ్లలో దర్శకుడిగా అతడికొక డిఫరెంట్ ఇమేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…