సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్లో పెద్ద స్లంప్ నడిచింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో చాలా వారాలు సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి. మార్చి చివర్లో మళ్లీ బాక్సాఫీస్కు ఊపొచ్చింది. ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో వేసవి సీజన్ ఘనంగా ఆరంభమైంది. వీకెండ్లో కలెక్షన్ల మోత మోగించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా బాగానే ఆడింది. రెండో వీకెండ్లోనూ దీని జోరు కొనసాగింది.
గత వారం ‘ఫ్యామిలీ స్టార్’ కొంత సందడి చేసింది. అనువాద చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ కూడా బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘ఫ్యామిలీ స్టార్’కు మంచి టాక్ వచ్చి ఉంటే కథ వేరుండేది. అయినా సరే.. గత వీకెండ్లో ప్రేక్షకులకు మూడు ఛాయిస్లు ఉన్నాయి. థియేటర్లలో సందడి కనిపించింది. కానీ ఈ వారం బాక్సాఫీస్ మళ్లీ డల్ అయిపోయింది.
ఈ వారం సినిమాల మీద ప్రేక్షకుల ముందు నుంచే పెద్దగా ఆసక్తి లేదు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చూస్తేనే ఇదొక రొటీన్ హార్రర్ కామెడీ అని తేలిపోవడంతో తొలి రోజు ఈ సినిమా థియేటర్లలో జనాలు మరీ పలుచనగా కనిపించారు. టాక్ కూడా బాలేకపోవడంతో సినిమా పుంజుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. ఇక ఈ వారం వచ్చిన మరో స్ట్రెయిట్ మూవీ ‘శ్రీరంగ నీతులు’ గురించి ప్రేక్షకులకు పట్టింపే లేదు. అనువాద చిత్రం ‘లవ్ గురు’కు కూడా స్పందన అంతంతమాత్రమే.
హిందీ చిత్రాల్లో ‘మైదాన్’కు టాక్ బాగున్నా తెలుగు రాష్టాల్లో రెస్పాన్స్ అంతంతమాత్రమే. మరో హిందీ మూవీ ‘బడేమియా చోటేమియా’కు డిజాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా వైపు కూడా జనాలు చూసే పరిస్థితి లేదు. ముందు వారాల్లో వచ్చిన టిల్లు స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ సినిమాలే ఈ వీకెండ్లోనూ కొంత ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on April 12, 2024 10:28 am
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…