తరుణ్ భాస్కర్కు దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ మంచి ఫాలోయింగ్ ఉంది. దర్శకుడిగా తన రెండో చిత్రం ఈ నగరానికి ఏమైంది తర్వాత అతను నటుడిగా బిజీ అయ్యాడు. అరడజను సినిమాలకు పైగానే నటించాడు. అతను లీడ్ రోల్ చేసిన మీకు మాత్రమే చెప్తాలో కామెడీ అదరగొట్టాడు. అదే కాక ఫలక్ నుమా దాస్, మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి చిత్రాల్లో కూడా అతడి కామెడీ బాగా పండింది.
ఇక తన స్వీయ దర్శకత్వంలో కొన్ని నెలల కిందటే వచ్చిన కీడా కోలా సినిమాలో నాయుడు పాత్రలో అతనెంతగా ఎంటర్టైన్ చేశాడో తెలిసిందే. దర్శకుడిగా కంటే నటుడిగానే అతను ఎక్కువగా అలరించాడు. ఈ సినిమా తర్వాత నటుడిగా అతణ్ని మరిన్ని పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు ఆశించారు.
అందుకు తగ్గట్లే తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అతడి సరసన ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ అంటున్నారు. సంజీవ్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఇక దర్శకుడిగా తరుణ్ తర్వాతి సినిమా విషయంలో ఏ అప్డేట్ లేదు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా తరుణ్ ఓ సినిమా చేయాల్సింది. అది వర్కవుట్ కాలేదు. అది కుదరని నేపథ్యంలోనే కీడాకోలా సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో దర్శకుడిగా మళ్లీ బ్రేక్ తీసుకుని నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నట్లున్నాడు తరుణ్.
This post was last modified on April 11, 2024 10:02 am
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…