డబ్బింగ్ రూపంలో చాలానే వచ్చాయి కానీ విజయ్ ఆంటోనీ పేరు చెబితే గుర్తొచ్చే సినిమా బిచ్చగాడు మాత్రమే. ఏళ్ళు గడుస్తున్నా ఆ బ్రాండ్ వేల్యూ మాత్రం తగ్గడం లేదు. దీని ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే వరస ఫ్లాపులతో అతని మార్కెట్ ఎప్పుడో పడిపోయినా బిచ్చగాడు 2కి మాత్రం గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. దీనికి ముందు తర్వాత వచ్చినవేవీ కనీస స్థాయిలో ఆడలేదు. గత చిత్రం హత్య మరీ దారుణంగా పబ్లిసిటీ ఖర్చులు కూడా తేలేదు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన విషయం కూడా జనాలకు గుర్తు లేదు.
ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న లవ్ గురు మీద విజయ్ ఆంటోనీ భారీ నమ్మకం పెట్టుకున్నాడు. ఈసారి మాస్ అంశాల జోలికి వెళ్లకుండా లవ్ జానర్ ని టచ్ చేశాడు. పెళ్ళైన కొత్త జంట మధ్య ఉండాల్సిన అనుబంధం, అండర్ స్టాండింగ్ గురించి పాఠాలు చెప్పబోతున్నాడు. కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజుల ముందే హైదరాబాద్ లో ప్రీమియర్ వేసి, పబ్లిక్ ఒపీనియన్ ని రికార్డు చేయించి ప్రమోషన్ కోసం వాడుతున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ అండదండలు దక్కడంతో పంపిణిపరంగా ఇబ్బందులు లేకుండా చెప్పుకోదగ్గ కౌంట్ లో థియేటర్లు దక్కబోతున్నాయి.
ఇది సక్సెస్ అయితేనే విజయ్ ఆంటోనీ టాలీవుడ్ మనుగడ మీద ఆశలు పెట్టుకునే అవకాశముంటుంది. మృణాళిని రవి హీరోయిన్ గా నటించిన ఈ ఎంటర్ టైనర్ లో మొత్తం తమిళ క్యాస్టింగే ఉన్నా కాన్సెప్ట్ మాత్రం షారుఖ్ ఖాన్ రబ్ నే బనాది జోడి తరహాలో ఉంటుందని ఆల్రెడీ షో చూసినవాళ్లు నుంచి వస్తున్న రిపోర్ట్. బాలేదని ఎవరూ చెప్పలేదు కానీ విజయ్ ఆంటోనీ ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. కొన్ని నెలలుగా డల్ గా ఉన్న డబ్బింగ్ మార్కెట్ కి ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ ఊపిరి పోశాయి. వాటి సరసన లవ్ గురు చేరుతుందో లేదో రేపు తేలిపోతుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…