మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప 2 ది రూల్ టీజర్ లో ఊహించని గెటప్ తో బన్నీని చూపించిన విధానం షాక్ ఇచ్చిన మాట నిజమే కానీ ఇంకా చాలా ఊహించుకున్న ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవం. అయితే దర్శకుడు సుకుమార్ కావాలనే ఒక ప్లాన్ ప్రకారం హైప్ ని బిల్డ్ చేసే క్రమంలో అసలు కంటెంట్ ని ఇంకా బయటికి వదల్లేదనే కామెంట్స్ లేకపోలేదు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో ఈ వీడియోకు వచ్చిన వ్యూస్ మీద సోషల్ మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. రెండు రోజుల్లో వచ్చిన 88 మిలియన్ వీక్షణలు నిజం కాదనేది టాపిక్.
మాములుగా ప్యాన్ ఇండియా సినిమాలు వివిధ మార్గాల్లో స్టార్ హీరోల అభిమానుల కోసం వ్యూస్ ఎక్కువ వచ్చేలా రకరకాల ఎత్తుగడలు వేసుకుంటారు. ఇది అందరూ చేసేదే. థర్డ్ పార్టీ ద్వారా కాంట్రాక్టు తీసుకుని వివిధ మార్గాల్లో పెంచుకోవడం ఒకటైతే, ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ని ఏర్పాటు చేసుకుని దీని మీదే వర్క్ చేస్తూ రికార్డులు వచ్చేలా చూసుకోవడం మరో స్ట్రాటజీ. అఫీషియల్ గా యాడ్స్ ని జొప్పించడం ద్వారా పెంచడమనే ఇంకో పద్ధతి కూడా అమలులో ఉంది. ఇవి కాకుండా సింపుల్ గా అప్లోడ్ చేసి నిజాయితీగా ఎన్ని వ్యూస్ వస్తాయనేది వ్యూయర్స్ కి వదిలిపెట్టడం ఇంకో మెథడ్.
వీటిలో పుష్ప ఏదో ఫాలో అయ్యిందో చెప్పడం కష్టం. అలాంటప్పుడు ఆధారాలు లేకుండా వ్యూస్ ఒరిజినల్ కాదని ఫేకని ప్రాపగండా చేయడం ఎంత వరకు కరెక్టని బన్నీ ఫ్యాన్స్ మాట. అయినా పుష్ప బ్రాండ్ కి ప్రత్యేకంగా మార్కెటింగ్ అవసరం లేదు. బోలెడు క్రేజ్ ఉంది. ఉత్తరాదిలోనూ భారీ రేట్లతో కొనేందుకు బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. ఆగస్ట్ 15 ఇంకా దూరంలో ఉంది. ట్రైలర్, లిరికల్ వీడియోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా బోలెడు ప్రమోషన్లు రావాల్సి ఉంది. ఇప్పుడు పుష్ప టీజర్ మీద ఇంత చర్చ అవసరం లేదన్నది అభిమానుల వాదన. నిజమే కానీ అంత ఆలోచించేది ఎవరు.
This post was last modified on April 10, 2024 6:07 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…